ముక్కంటికి ముత్యాల కవచాలు
శ్రీకాళహస్తి: హైదరాబాద్కు చెందిన అలంకార సేవ ట్రస్టు, శ్రీరంగ ఎంటర్ప్రైజస్ నిర్వాహకులు శుక్రవారం జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామి ఉత్సవమూర్తులకు అలంకరించేందుకు ముక్తాంగి (ముత్యాల కవచం)ను అందజేశారు. వీటిని ఈఓ బాపిరెడ్డి స్వీకరించి దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. వారికి స్వామి అమ్మవార్ల అంతరాలయ దర్శన ఏర్పాట్లు చేయించారు. దర్శనానంతరం వేద పండితులు వారిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దాతలు రాఖీ, రాజేష్, ప్రియాంక, సుధీర్ చౌహాన్, రాధ, కిషన్, గాయత్రి, సతీష్ ఆమ్లే, రేఖ, తులసీదాస్ చౌహాన్, ఆలయ అధికారులు తదితరులున్నారు.
ముక్కంటికి ముత్యాల కవచాలు


