హోరాహోరీగా చెస్, క్యారమ్ పోటీలు
శ్రీకాళహస్తి: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి ఏఎస్డబ్ల్యూఓ పరిధిలోని సంక్షేమ, విద్యా సహాయకులకు ఏ ఎస్డబ్ల్యూఓ కార్యాలయంలో నిర్వహించిన చెస్, క్యారమ్స్ పోటీలు హోరాహోరీగా సాగాయి. చెస్ పోటీల్లో.. మహిళల విభాగంలో జి వినాయకమ్మ (తొట్టంబేడు) విన్నర్గా, ఏ మౌనిక (శ్రీకాళహస్తి) రన్నర్గా, పురుషుల విభాగంలో ఎస్ అశోక్ కుమార్ (రేణిగుంట)విన్నర్గా, వై గవాస్కర్ (శ్రీకాళహస్తి) రన్నర్గా నిలిచారు. క్యారమ్స్ పోటీల్లో.. మహిళల విభాగంలో ఏ మౌనిక (శ్రీకాళహస్తి), మేరి దివ్య (కేవీబీ పురం) జంట విన్నర్స్గా, జీ వినాయకమ్మ, పి అరుణ (తొట్టంబేడు) రన్నర్స్ గా, పురుషుల్లో ఎం నాగమోహన్ రాజు, ఏ మునికుమార్ (కేవీబీ పురం) జంట విన్నర్స్గా, పి మునిశేఖర్ (కేవీబీ పురం), వై గవాస్కర్ (శ్రీకాళహస్తి) రనర్స్ గా నిలిచారు.


