నా కోడలు వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుని.. | - | Sakshi
Sakshi News home page

నా కోడలు వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుని..

Sep 23 2023 12:54 AM | Updated on Sep 23 2023 10:45 AM

- - Sakshi

‘నా కోడలు వేరొకరితో సంబంధం పెట్టుకుని, పథకం ప్రకారం నా కొడుకుని హత్య చేయించింది’ అని పశ్చిమబెంగాల్‌ ప్రాంతానికి చెందిన కార్తిక్‌ మండల్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

 నాయుడుపేటటౌన్‌: ‘నా కోడలు వేరొకరితో సంబంధం పెట్టుకుని, పథకం ప్రకారం నా కొడుకుని హత్య చేయించింది’ అని పశ్చిమబెంగాల్‌ ప్రాంతానికి చెందిన కార్తిక్‌ మండల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన స్థానిక పోలీసులను కలిసి వివరాలు వెల్లడించారు.

వివరాలు.. ఈనెల 1వ తేదీ అర్ధరాత్రి మేనకూరు సెజ్‌ పరిధిలోని లాయల్‌ టెక్స్‌టైల్స్‌ పరిశ్రమలో పనిచేస్తున్న చరణ్‌జిత్‌ మండల్‌ (31) హాస్టల్‌ మిద్దైపె నుంచి పడి ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ సంఘటనపై ఈనెల 2వ తేదీ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

విషయం తెలుసుకున్న మృతుడి తండ్రి కార్తిక్‌ మండల్‌ పశ్చిమబెంగాల్‌ నుంచి అతని కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం నాయుడుపేట పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. తన కుమారుడి మృతికి ప్రధాన కారకురాలు కోడలు, ఆమె కుటుంబ సభ్యులేనని ఎస్‌ఐ వేణుకు విన్నవించారు. మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుని ఇంటి నుంచి వెళ్లిపోయిందని, ఆపై నగదు కోసం మానసికంగా తన కుమారుడిని వేధించి చంపించిందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement