Warangal: వ్యభిచార గృహంపై దాడి.. పశ్చిమ బెంగాల్‌ నుంచి యువతులను తీసుకువచ్చి

Warangal Police raid On Prostitution Reddy Colony Three Arrested - Sakshi

సాక్షి, వరంగల్‌: హనుమకొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రెడ్డికాలనీలో వ్యభిచార గృహంపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మంగళవారం రాత్రి దాడి చేశారు. ఈ మేరకు ముగ్గురిని అరెస్ట్‌ చేసినట్లు టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ డాక్టర్‌ జితేందర్‌రెడ్డి తెలిపారు. రెడ్డికాలనీకి చెందిన ఓ మహిళ  అదే కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకొని పశ్చిమ బెంగాల్‌ నుంచి ఇద్దరు యువతులను తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ మేరకు అందిన సమాచారంతో వ్యభిచార గృహంపై దాడి చేసి నిర్వాహకురాలు కుతాటి నందిని, విటులు మరిపెల్లి స్టిఫెన్, మరిపెల్లి పీటర్‌ను అరెస్ట్‌ చేసి హనుమకొండ పోలీసులకు అప్పగించినట్లు ఏసీపీ వివరించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top