బాసరలో వసంత పంచమి వేడుకలు
భెంసా: నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రంలో వసంత పంచమి వేడుకలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఆలయ ఈవో విజయరామారావు స్థానిక వైదిక బృందం ఆధ్వర్యంలో వేడుకలను ప్రారంభించారు. బాసర ఆలయ స్థానాచార్య, ప్రధానార్చకుల పర్యవేక్షణలో గోమాతకు పూజలు చేశారు. తర్వాత యాగశాలలో యాగ పూజలు నిర్వహించారు. భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. చిన్నారులతో అక్షరాభ్యాస పూజలు చేయించారు.