సాక్షి,హైదరాబాద్: మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టుల అగ్రనేత మడావి హిడ్మా స్థానంలో నియమించిన బార్సెదేవ తెలంగాణ పోలీసులకు లొంగిపోయినట్లు తెలుస్తోంది.
ముందుగా బార్సెదేవను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారంటూ సోషల్ మీడియాలో వార్తలు వెలుగులోకి వచ్చాయి. అయితే, బార్సెదేవను తెలంగాణ పోలీసులు అరెస్టు చేయలేదని, ఆయనే స్వయంగా పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. లొంగిపోయిన బార్సెదేవను తెలంగాణ పోలీసులు మీడియా ముందు ప్రవేశ పెట్టే అవకాశం ఉంది
దండకారణ్యంలో పార్టీని దూకుడుగా నడిపించిన మావోయిస్టు టాప్ కమాండర్ మడావి హిడ్మా మరణం తర్వాత ఆ స్థానంలో మరో కీలక కమాండర్ కోసం అన్వేషణ సాగింది. హిడ్మాకు సహచరుడు, ఆయన గ్రామం పువర్తికే చెందిన బార్సె దేవాను ఈ కీలక స్థానంలో నియమితులయ్యారు. తాజాగా బార్సెదేవ సైతం పోలీసుల సమక్షంలో లొంగిపోయారు. దీంతో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలినట్లైంది.


