సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏప్రిల్ 1 నుంచి మూడో డిస్కమ్ను ప్రభుత్వం ప్రారంభించనుంది. సుమారు 30 లక్షల సర్వీస్ కనెక్షన్లతో కొత్త డిస్కమ్ ఏర్పాటు చేసింది. వ్యవసాయ ఉచిత విద్యుత్, మెట్రో వాటర్ బోర్డు, లిఫ్ట్ ఇరిగేషన్ సరఫరా కొత్త డిస్కమ్కు బదిలీ చేసింది. 2,000 మంది ఇంజినీర్లు, సిబ్బంది బదిలీకి ప్రణాళిక సిద్ధం చేసింది.
మూడో డిస్కమ్ సీఎండీగా ముషర్రఫ్ ఫారుఖీని నియమించింది. పవర్ అంబులెన్స్లతో వేగవంతమైన అవుటేజ్ పునరుద్ధరణ చర్యలు చేపట్టింది. ఫీడర్ అవుటేజ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా రియల్ టైమ్ మానిటరింగ్ ఏర్పాటు చేశారు.


