సూర్యాపేట: 216 మంది బాలికలకు రెండే.. ఇదీ వరస | Sakshi
Sakshi News home page

సూర్యాపేట: 216 మంది బాలికలకు రెండే.. ఇదీ వరస

Published Fri, Dec 31 2021 8:36 AM

Suryapet: Only 2 Washrooms For 216 Girls At Arvapally School - Sakshi

సాక్షి, అర్వపల్లి: సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో 216 మంది బాలికలు, 302 మంది బాలురు విద్యనభ్యసిస్తున్నారు. బాలికలకు 2 మరుగుదొడ్లు ఉన్నాయి. పారిశుధ్య కార్మికు ల్లేక శుభ్రం చేయక జామ్‌ అయిపోయాయి. తప్పని పరిస్థితిలో బాలికలు వాటినే ఆశ్రయిస్తున్నారు. దీనికి తోడు ఈ మరుగుదొడ్ల వద్దకు వెళ్లడానికి దారి సరిగా లేదు. ఆవరణలో మొలిచిన గడ్డిలో నీళ్లు చేరి మరుగుదొడ్లకు వెళ్లడానికి ఇబ్బందికరంగా ఉంది. బాలురకు మరుగుదొడ్లు అసలే లేవు. వీరు నిత్యం విరామ సమయంలో పాఠశాల ఆవరణలోనే మూత్ర విసర్జన చేస్తున్నారు.
చదవండి: Covid: యాంటీ వైరల్ ఔషధం మోల్నుపిరావిర్‌’.. ఒక్క మాత్ర రూ.63  

Advertisement

తప్పక చదవండి

Advertisement