breaking news
arvapally
-
సూర్యాపేట: 216 మంది బాలికలకు రెండే.. ఇదీ వరస
సాక్షి, అర్వపల్లి: సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి జెడ్పీహెచ్ఎస్లో 216 మంది బాలికలు, 302 మంది బాలురు విద్యనభ్యసిస్తున్నారు. బాలికలకు 2 మరుగుదొడ్లు ఉన్నాయి. పారిశుధ్య కార్మికు ల్లేక శుభ్రం చేయక జామ్ అయిపోయాయి. తప్పని పరిస్థితిలో బాలికలు వాటినే ఆశ్రయిస్తున్నారు. దీనికి తోడు ఈ మరుగుదొడ్ల వద్దకు వెళ్లడానికి దారి సరిగా లేదు. ఆవరణలో మొలిచిన గడ్డిలో నీళ్లు చేరి మరుగుదొడ్లకు వెళ్లడానికి ఇబ్బందికరంగా ఉంది. బాలురకు మరుగుదొడ్లు అసలే లేవు. వీరు నిత్యం విరామ సమయంలో పాఠశాల ఆవరణలోనే మూత్ర విసర్జన చేస్తున్నారు. చదవండి: Covid: యాంటీ వైరల్ ఔషధం మోల్నుపిరావిర్’.. ఒక్క మాత్ర రూ.63 -
అరుదైన బంగారు చేప
సూర్యాపేట : సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం కొమ్మాలలోని గంగదేవి చెరువులో అరుదైన బంగారు చేప ప్రత్యక్షమైంది. గ్రామంలో మత్స్యకారులు రెండు రోజులుగా చేపలు పడు తున్నారు. ఈ క్రమంలో గురువారం వలకు ఈ చేప చిక్కింది. దీన్ని గ్రామస్తులు వింతగా చూశారు.