‘మహాలక్ష్మి’ వదంతులు.. బారులు తీరిన మహిళలు | Rumour Over 2500 Deposit Under Mahalakshmi Scheme, More Details Inside | Sakshi
Sakshi News home page

‘మహాలక్ష్మి’ వదంతులు.. బారులు తీరిన మహిళలు

Aug 7 2025 7:52 AM | Updated on Aug 7 2025 9:06 AM

Rumour over 2500 deposit under Mahalakshmi scheme

నిజామాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశ పెడతామని చెప్పిన మహాలక్ష్మి పథకం కింద రూ.2,500 ఇండియన్‌ పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంకులో అకౌంట్‌ ఉంటేనే వస్తుందని వదంతులు రావడంతో మహిళలు పోస్టాఫీసుకు బారులు తీరారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని పోస్టా­ఫీసులో రూ.200లు పెట్టి కొత్త అకౌంట్‌ ఇవ్వాలని కౌంటర్‌ వద్ద తోపులాడుకుంటూ ఇలా అకౌంట్లు తీస్తున్నారు. దీనిపై పోస్టాఫీసు అధికారులను సంప్రదించగా.. బయట ఎవరో వదంతి సృష్టించడంతో ఇంతమంది వస్తున్నారని చెప్పారు. 


 

Advertisement
 
Advertisement
Advertisement