
ఫైల్ఫోటో
హైదరాబాద్: మూడు రోజుల క్రితం జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన తర్వాత ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రధానంగా ఎయిర్లైన్స్ నిర్వహణ సంస్థలకు ఆ విమాన ప్రమాదం మరింత అలజడి రాజేసింది. అదే సమయంలో విమానం మాటంటే ప్రజల్లో భయం కనిపిస్తోంది. ఇదిలా ఉంచితే,. తాజాగా జర్మనీ నుండి హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి వస్తున్న విమానానికి బాంబు బెదిరింపుతో కలకలం రేగింది.
దాంతో ఆ విమానం తిరిగి జర్మనీలోని ఫ్రాంకఫర్డ్ విమానాశ్రయానికి తిరిగి పయనమైంది. లుప్తాన్సా ఎయిర్ లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ఉన్నపళంగా ఆ విమానాన్ని మార్గమధ్యంలోనే వెనక్కి రప్పించే ఏర్పాట్లు చేశారు. లుప్తాన్సా LH 752 విమానానికి బాంబు బెదిరింపు నేపథ్యంలో తిరిగి మళ్లీ జర్మనీకి వెళ్లిపోయింది. అయితే విమానం ఎక్కడ ఉండగా జరిగింది అనేది తెలియాల్సి ఉంది.