మావోయిస్టు మిలీషియా సభ్యుడు అరెస్ట్‌

Person From Maoist militia Group Arrested In Mulugu - Sakshi

సాక్షి, ములుగు : సిపిఐ మావోయిస్టు మిలీషియా సభ్యుడు లక్ష్మయ్య శనివారం అరెస్ట్‌ అయ్యారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని అలుబాక, కొండాపూర్‌ బ్రిడ్జి వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులను చూసి పారిపోతున్న వ్యక్తిని పట్టుకొని విచారించగా మావోయిస్టు మిలీషియన్‌ సభ్యుడైన లక్ష్మయ్యగా గుర్తించారు. లక్ష్మయ్యను అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి కార్డేక్స్ వైర్,జిలిటెన్ స్టిక్స్ లు 2, 2 టిఫిన్ బాక్సులు 2 డిటోనేటర్,1 తూటలు స్వాధీనం చేసుకన్నారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top