breaking news
militia member
-
ఐదుగురు మావోయిస్టు మిలీషియా సభ్యుల అరెస్టు
కొత్తగూడెం టౌన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో నిషేధిత మావోయిస్టు పార్టీ మిలీషియా సభ్యులు ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్జీఏ) వారోత్సవాల సందర్భంగా వాటిని విజయవంతం చేయాలని మావోయిస్టులు ఇప్పటికే ప్రకటనలు విడుదల చేశారు. మరోపక్క ఆదివాసీలను మావోయిస్టులు వేధిస్తున్నారంటూ ఊరూరా పోస్టర్లు వేయించిన పోలీసులు ఇంకో పక్క కూంబింగ్ ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఐదుగురు మిలీషియా సభ్యులు పట్టుబడగా, వివరాలను కొత్తగూడెంలోని తన కార్యాలయంలో శనివారం ఎస్పీ డాక్టర్ వినీత్ వెల్లడించారు. చర్ల మండలం ఎర్రంపాడు ఆటవీప్రాంతంల్లో పోలీసు, సీఆర్పీఎఫ్ సిబ్బందితోపాటు స్పెషల్ పార్టీ, 81, 141 బెటాలియ¯న్ల సిబ్బంది ఉదయం కూంబింగ్ చేపట్టారని, ఈ సందర్భంగా అనుమానాస్పదంగా కనిపించిన ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారించగా మిలీషియా సభ్యులని తేలిందని చెప్పారు. వీరిలో ఛత్తీస్గఢ్లోని పోలీసు కిష్టారాం నిమ్మలగూడెంకు చెందిన బెడమ బీమయ్య, సోడి మూయా, పోడియం అడమయ్య, పూనం నగేశ్, జట్టపాడుకు చెందిన మడకం నగేశ్ ఉన్నారని తెలిపారు. వీరు రెండేళ్లుగా మావోయిస్టు పార్టీలో పనిచేస్తూ తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని వెల్లడించారు. కాగా, తెలంగాణ ప్రజలు, ఆదివాసీలు వివేకంతో ఆలోచించి అభివృద్ధి నిరోధకులైన మావోయిస్టులను తరిమివేయగా, ఛత్తీస్గఢ్కు పారిపోయి ఇక్కడ ఇన్ఫార్మర్ల సాయంతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఎస్పీ ఆరోపించారు. మావోయిస్టులకు ఎవరైనా ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ సహకరిస్తే చట్టపరంగా కఠినచర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. సమావేశంలో ఓఎస్డీ సాయి మనోహార్, భద్రాచలం ఏఎస్పీ ఆకాం„Š యాదవ్, చర్ల సీఐ అశోక్, బెటాలియన్ల అధికారులు కమల్వీర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
మావోయిస్టు మిలీషియా సభ్యుడు అరెస్ట్
సాక్షి, ములుగు : సిపిఐ మావోయిస్టు మిలీషియా సభ్యుడు లక్ష్మయ్య శనివారం అరెస్ట్ అయ్యారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని అలుబాక, కొండాపూర్ బ్రిడ్జి వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులను చూసి పారిపోతున్న వ్యక్తిని పట్టుకొని విచారించగా మావోయిస్టు మిలీషియన్ సభ్యుడైన లక్ష్మయ్యగా గుర్తించారు. లక్ష్మయ్యను అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి కార్డేక్స్ వైర్,జిలిటెన్ స్టిక్స్ లు 2, 2 టిఫిన్ బాక్సులు 2 డిటోనేటర్,1 తూటలు స్వాధీనం చేసుకన్నారు. అనంతరం రిమాండ్కు తరలించారు. -
పోలీసుల అదుపులో మిలిషియా సభ్యుడు
చింతూరు : తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలం బొద్దుగూడెంలో మావోయిస్టు మిలిషియా సభ్యుడు మంచిక మహదేవ్ను పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని పోలీస్ స్టేషన్కు తరలించారు. బొద్దుగూడెంలో మావోయిస్టు పోస్టర్లను మహదేవ్ గోడలపై అతికిస్తున్నాడు. ఆ క్రమంలో గస్తీ తిరుగుతున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. మహేదేవ్ స్వగ్రామం చింతూరు మండలం పెగ పంచాయతీ ఎదిర్లగూడెం అని పోలీసులు తెలిపారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.