Live Updates
ముగిసిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో.. 48.42 శాతం పోలింగ్ నమోదు
- జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సాయంత్రం 6 గంటల వరకు 48.42 శాతం పోలింగ్ నమోదు
- సాయంత్రం 6 గంటల తర్వాత క్యూలో ఉన్నవారికి ఓట్ వేసే అవకాశం కల్పించిన ఎన్నికల అధికారులు
- మరికాసేపట్లో ఆ ఓట్లతో కలిసి పూర్తి పోలింగ్ శాతం ప్రకటించనున్న ఎన్నికల అధికారులు
యూసఫ్గూడ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
- యూసఫ్గూడ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
- బీఆర్ఎస్, కాంగ్రెస్శ్రేణుల మధ్య వాగ్వాదం
- దొంగ ఓట్లు వేస్తున్నారని ఇరు పార్టీల పరస్పర ఆరోపణలు
- బీఆర్ఎస్ నేత కౌశిరెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు
- ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
ముగిసిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్
- సాయంత్ర 5గంటల వరకు 47.16శాతం పోలింగ్ నమోదు
- 6గంటల వరకు క్యూలైన్లో ఉన్న వారికే ఓటు వేసేందుకు అనుమతి
- ఈ నెల 14న ఓట్ల లెక్కింపు.. అదే రోజుల ఫలితాలు విడుదల
ఎర్రగడ్డ: పోలింగ్ బూత్ వద్ద ఆందోళన
- ఎర్రగడ్డ డాన్ బాస్కో స్కూల్ పోలింగ్ బూత్ వద్ద ఆందోళన
- పోలింగ్ బూత్ నంబర్ 382 వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన
- కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బీఆర్ఎస్ ఏజెంట్లను అడ్డుకున్నాడని నిరసన
సాయంత్రం 5 గంటల వరకు 47.16 శాతం పోలింగ్
- జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల వరకు 47.16 శాతం పోలింగ్ నమోదు
షేక్పేట డివిజన్ పోలింగ్ స్టేషన్ వద్ద లాఠీచార్జ్
- షేక్పేట డివిజన్ పోలింగ్ స్టేషన్ వద్ద లాఠీచార్జ్
- 4,5,6,7,8 బూత్ వద్ద ఉద్రిక్తత
- పోలింగ్ స్టేషన్ వద్దకు వచ్చిన దాసోజు శ్రవణ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- పోలింగ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ నేతలు ఉండడంతో అభ్యంతరం తెలిపిన కాంగ్రెస్ నేతలు
- కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య తోపులాట
- లాఠీచార్జీ చేసి చెదరగొట్టిన పోలీసులు
ఇంకా ఊపందుకోని పోలింగ్..!
- సుమారు 10 గంటలు గడుస్తున్నా పెరగని పోలింగ్
- మరో గంటలో ముగియనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్
పోలింగ్కి మిగిలింది.. మరో రెండు గంటలు మాత్రమే..
- జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఇంకా ఊపందుకోని పోలింగ్ ప్రక్రియ
- పోలింగ్ మొదలై సుమారు 9 గంటలు గడుస్తున్నా పెరగని పోలింగ్ శాతం
- మధ్యాహ్నం 3 గంటల వరకు 40.20 శాతం మాత్రమే నమోదైన పోలింగ్
- ఎన్నికల సంఘం ఆశించిన మేర పెరగని పోలింగ్ శాతం
- చివరి రెండు గంటల్లో పోలింగ్ పెరిగే అవకాశం
- 6 గంటల లోపు పోలింగ్ స్టేషన్ వద్దకు చేరుకున్న వాళ్లకు ఓటు వేసే అవకాశం కల్పిస్తామంటున్న ఎన్నికల అధికారులు
3 గంటల వరకు 40.20 పోలింగ్ శాతం నమోదు
- జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 3 గంటల వరకు 40.20 పోలింగ్ శాతం నమోదు
- రెహమత్నగర్ డివిజన్లో పోలింగ్ బూత్లను పరిశీలించిన బీజేపీ అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డి
- రెహమత్ నగర్ డివిజన్ పబ్లిక్ స్కూల్ లో ఉన్న 7 పోలింగ్ కేంద్రాల పరిశీలన
- దీపక్ రెడ్డితో కాషాయ కండువా వేసుకొని వచ్చిన బీజేపీ కార్యకర్తలు
- కాషాయ కండువా తీసివేయాలని కార్యకర్తలకు చెప్పిన పోలీసులు
- పార్టీ కండువా కాదని పోలీసులతో వాగ్వివాదం చేసిన బీజేపీ లంకాల బృందం
- సాక్షి టీవీతో మాట్లాడిన బీజేపీ అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డి
- ఓటర్లు ఆశించినంత మేరకు పోలింగ్ బూత్లకు రావడం లేదు
- ఎవరికైనా ఓటు వేయండి.. కానీ ఓటు హక్కును వినియోగించుకోండి
- స్థానికంగా ప్రజల వెంట ఉండే వాళ్లు ఎవరు అనేది ప్రజలు గ్రహించాలి
- సమస్యలను పరిష్కరించి నాయకులు ఎవరో ఓటర్లు చూడాలి
ప్రజాస్వా మ్య గౌరవాన్ని ఎప్పుడూ ఆచరించే పార్టీ కాంగ్రెస్: మంత్రి పొన్నం
- జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రజాస్వామ్యంగా జరగాలని ఆకాంక్షించే పార్టీ కాంగ్రెస్ పార్టీ
- ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరైనా సరే ఏ పార్టీ నాయకులు అయిన నియోజకవర్గం కానీ నాయకులు నియోజకవర్గం లో ఎన్నికలు జరిగే సమయంలో తిరిగితే వారిపైన కేసులు పెట్టుకోవచ్చు
- కానీ బీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోతున్నామని అసహనంతో మూడు రోజులుగా ఏది పడితే అది మాట్లాడుతున్నారు
- అభ్యర్థిని అవమానపరిచే విధంగా మా పార్టీని కించపరిచే విధంగా చంపుతారా ,పొమ్మంటారా అని సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు..
- ప్రచారం ముగిసిన 5 గంటల తర్వాత ఎవరు కూడా ఎక్కడ నియోజకవర్గంలో కనబడడం లేదు
- ఎన్నికల సంఘం తమ కార్యాచరణ ప్రకారం ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన ఏ పార్టీ అయినా కేసులు పెట్టుకోవచ్చు..పోలీసులు కూడా చర్యలు తీసుకోవచ్చు..
- Brs అభ్యర్థి రాజకీయంగా సానుభూతి పొందాలనే ప్రకటన తీవ్రంగా ఖండిస్తున్నాం..
- ఇది కూడా ఎన్నికల నియమావళి నిబంధనలు ఉల్లంఘించినట్లు
ఈసీకి మరోసారి బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు
- బూత్ నంబర్ 42 బృందావన్ కాలనీలో డబ్బులు పంచారంటూ బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు
- రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని అంటున్నారు
- అదే ప్రజాస్వామ్యాన్ని జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ఖూనీ చేసింది
- డీసీఎం భట్టి విక్రమార్కతో పాటు 14 మంది మంత్రులు జూబ్లీహిల్స్లో తిరుగుతున్నారు
- ఓటుకు ఐదారు వేలు పంచుతున్నారు
- బాబా ఫసియుద్దీన్, ఆయన బావమరిది అనుచరులు మా పార్టీ మహిళా కార్యకర్తలపై దాడి చేశారు: బీఆర్ఎస్
ఓటు హక్కు వినియోగించుకున్న సినీ నటుడు గోపీచంద్
శ్రీనగర్ కాలనీ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ నటుడు గోపీచంద్
షేక్ పేట్ డివిజన్లో మందకొడిగా సాగుతున్న పోలింగ్
ఓటర్లు లేక వెలవెలబోతున్న కొన్ని పోలింగ్ కేంద్రాలు
చివరి రెండు గంటలు ఓటు వేసేందుకు ఓటర్లు వస్తారని అధికారుల అంచనా అంచనా
ఒంటిగంట వరకు 31.94 శాతం
- జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కు మధ్యాహ్నం ఒంటిగంట వరకు 31.94 శాతం పోలింగ్ నమోదు
- ఉదయం 7 నుంచి 9 వరకు మొదటి రెండు గంటల్లో 10.02 శాతం నమోదు
- ఆ తర్వాత 9 నుంచి 11 వరకు రెండు గంటల్లో 10.74 శాతం నమోదు
- ఆ తర్వాత 11 నుంచి ఒంటి గంట వరకు రెండు గంటల్లో 11.18 శాతం నమోదు
- గంట గంట కి నెమ్మదిగా పెరుగుతున్న ఓటింగ్ శాతం
- చివరి రెండు గంటల్లో సాయంత్రం 4 నుంచి 6 వరకు పోలింగ్ శాతం పెరుగుతుందని అధికారుల అంచనా
- సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉండటంతో పోలింగ్ శాతం పెరిగే అవకాశం
ఎన్నికల కమిషన్కు కాంగ్రెస్ ఫిర్యాదు
- జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఒంటి గంట వరకు 31.94 పోలింగ్ శాతం నమోదు
- ఎన్నికల కమిషన్కు కాంగ్రెస్ ఫిర్యాదు
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డితో పాటు మరికొందరు నేతలపై ఫిర్యాదు
- 110 నుంచి 120 వరకు ఉన్న బూత్ల ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఫిర్యాదు చేసిన కాంగ్రెస్
- బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారని ఫిర్యాదు
మందకొడిగా జూబ్లీహిల్స్ పోలింగ్
- మందకొడిగా జూబ్లీహిల్స్ పోలింగ్
- పోలింగ్ సెంటర్ల వైపు ఆసక్తి చూపని ఓటర్లు
- బస్తీల్లో మాత్రమే హడావిడి
- సాయంత్రం 6గం. దాకా కొనసాగనున్న పోలింగ్
మీడియాను చూసి జారుకున్న వైరా ఎమ్మెల్యే
- జూబ్లీహిల్స్లో నాన్ లోకల్స్ నేతల హల్ చల్
- సెయింట్ అల్ఫోన్సా హైస్కూల్ లో పోలింగ్ బూత్ నెంబర్ 121
- ఆ పక్కన ఉన్న ఇంట్లో కాంగ్రెస్ నాయకులతో కలిసి వైరా ఎమ్మెల్యే రామ్ దాస్ నాయక్ మీటింగ్
- సిద్దార్థ్ నగర్ ఏరియాలోని పోలింగ్ బూత్ ఏరియాలో తిరుగుతూ కాంగ్రెస్ నాయకులతో కలిసి ఓటర్లను ప్రభావితం చేస్తున్న ఎమ్మెల్యే!
- వీడియో తీస్తున్న మీడియా ప్రతినిధులతో గొడవకు దిగిన ఎమ్మెల్యే అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు
- మీడియా ను చూసి అనుచరులతో కలిసి కారులో మెల్లగా జారుకున్న ఎమ్మెల్యే
11గం. దాకా ఎంత శాతం పోలింగ్ అంటే..
- జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ నెమ్మదిగా సాగుతోంది
- 11 గం. దాకా 21 శాతం పోలింగ్ నమోదు అయ్యింది
- సాయంత్రం 6గం. దాకా ఓటింగ్కు అవకాశం
నాన్లోకల్స్ వ్యవహారంపై సీఈవో సీరియస్
- జూబ్లీహిల్స్ పోలింగ్పై స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సుదర్శన్రెడ్డి
- పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది: సీఈవో సుదర్శన్రెడ్డి
- నియోజకవర్గంలో నాన్లోకల్స్ నేతల సంచారంపై కేసులు నమోదు చేయాలని ఆదేశించాం: సీఈవో సుదర్శన్రెడ్డి
- ఇప్పటివరకు నాన్లోకల్స్పై మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేశాం: సీఈవో సుదర్శన్రెడ్డి
- మాక్ పోలింగ్లో ఈవీఎంలు మొరాయించాయి: సీఈవో సుదర్శన్రెడ్డి
- 9 చోట్ల ఈవీఎంలను మార్చాం: సీఈవో సుదర్శన్రెడ్డి
జూబ్లీహిల్స్ బైపోల్.. అభ్యర్థులు పరస్పర ఆరోపణలు
- కొనసాగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్
- బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల పరస్పర ఆరోపణలు
- కాంగ్రెస్వాళ్లు దౌర్జన్యం చేస్తున్నారు: లంకల దీపక్ రెడ్డి
- బీజేపీ వాళ్లపై దాడికి పాల్పడుతున్నారు: లంకల దీపక్ రెడ్డి
- పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు: మాగంటి సునీత
- ఓటమి భయంతో కాంగ్రెస్ దాడులు: మాగంటి సునీత
- కాంగ్రెస్ దాడులకు భయపడి ఓటర్లు రావడం లేదు: మాగంటి సునీత
- ఆరోపణలు చేసేవాళ్లు చేస్తూనే ఉంటారు: నవీన్ యాదవ్
- సాయంత్రానికి 60 శాతం పోలింగ్ నమోదు కావొచ్చు: నవీన్ యాదవ్
బోరబండలో మొరాయించిన ఈవీఎం
- బోరబండ 318 బూత్లో ఈవీఎం మొరాయింపు
- కొత్తది తెచ్చిన అధికారులు
- కాసేపు ఓటింగ్కు అంతరాయం
- కొనసాగుతున్న పోలింగ్
ఎన్నికల సంఘం సీరియస్
- జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో యదేచ్ఛగా నాన్ లోకల్ నేతల సంచారం
- ఎన్నికల సంఘం ఆగ్రహం
- ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోలింగ్ బూత్కు రావడంపై ఆగ్రహం
- బీఆర్ఎస్ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు
- అధికార నేతల విషయంలో ఉదాసీనత
- బీర్ల ఐలయ్య, రామచంద్రనాయక్, శంకర్ నాయక్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశం
డబ్బులు పంచుతూ పట్టుబడి..
- వెంగళరావు నగర్లో ఓటర్లకు డబ్బు పంపిణీ
- బూత్ నెంబర్ 205 జవహార్ నగర్లో ఓటర్లకు డబ్బులు
- డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికిపోయిన కాంగ్రెస్ లోకల్ లీడర్
- కాలర్ పట్టుకుని అధికారులకు అప్పజెప్పిన బీఆర్ఎస్ నేతలు
బీజేపీవాళ్లను బెదిరిస్తున్నారు
- వెంగళ్ రావు నగర్ లో పోలింగ్ బూత్ లను పరిశీలోంచిన బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి
- కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్లపై దాడికి పాల్పడుతున్నారు..
- బూత్ల్లో తిరుగుతున్న బీజేపీ వాళ్ళను సాయంత్రం మీ అంతూ చూస్తామని బెదిరిస్తున్నారు..
- ఇదేంత వరకు కరెక్ట్ ఆలోచించాలి
- ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేసిన దీపక్ రెడ్డి
- చాలా మంది తరువాత వేద్దాం అని మాట్లాడుకుంటున్నారు
- ఓటర్లను ఓటింగ్ లో పాల్గొనాలని మళ్ళీ మళ్ళీ కోరుతున్నాను
ఓటేసిన నవీన్ యాదవ్
- ఓటేసిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్
- కుటుంబంతో కలిసి యూసఫ్గూడలో ఓటు హక్కు వినియోగించుకున్న నవీన్
- యూసఫ్గూడలోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కాంగ్రెస్ అభ్యర్థి
బీఆర్ఎస్ ఫిర్యాదుల పర్వం
- ఉదయం నుంచి రిటర్నింగ్ అధికారికి 60 ఫిర్యాదులు చేసిన బీఆర్ఎస్
- స్థానికేతర ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఇంకా నియోజకవర్గంలోనే తిరుగుతున్నారని ఫిర్యాదు
- ఓటర్లను డబ్బులు ఇచ్చి ప్రలోభ పెడుతున్నారంటూ 50 కి పైగా ఫిర్యాదులు చేసిన బీఆర్ఎస్
ఓటేసిన నటుడు తనికెళ్ల భరణి
- ఓటు హక్కు వినియోగించుకున్న సినీ నటుడు తనికెళ్ల భరణి
- యూసుఫ్గూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఓటేసిన సీనియర్ నటుడు
- జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు
నా నంబర్ కనిపించకుండా చేస్తున్నారు: దీపక్రెడ్డి
- అక్కడక్కడ ఈవీఎంలు మొరాయిస్తున్నాయ్
- పలుచోట్ల నా నంబర్ కనిపించకుండా ఈవీఎంలు అడ్డుగా పెట్టారు
- కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్లు బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు
- కాంగ్రెస్ దాడిలో బీజేవైఎం కార్యకర్తకు గాయాలు అయ్యాయి.
- దాడుల వ్యవహారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా
- స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా వాతావరణం కల్పించాలి
- పోలింగ్ సరళి చూస్తే బీజేపీ పట్ల ఓటర్లు సానుకూలంగా ఉన్నారు
- గతంతో పోలిస్తే పోలింగ్ శాతం పెరిగేలా కనిపిస్తోంది
- సాక్షి టీవీతో జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి
మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్కు పోలీసుల విజ్ఞప్తి
- రెహమత్ నగర్ డివిజన్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్.
- పీజేఆర్ చౌరస్తాలో మాజీ మంత్రి పర్యటన
- నియోజకవర్గం నుంచి వెళ్లిపోవాలని సూచించిన డీసీపీ శ్రీనివాస్
ఉదయం 9.30 నిమిషాల వరకు 10.02 శాతం
- జూబ్లీహిల్స్ బై పోల్ పోలింగ్
- ఉదయం 9.30 నిమిషాల వరకు 10.02 పోలింగ్ శాతం నమోదు
మాగంటి సునీతను అడ్డుకున్న పోలీసులు
- రెహమత్ నగర్ పోలింగ్ బూత్ లో ఏర్పాట్లు సరళిని పరిశీలిస్తున్న మాగంటి సునీత గోపీనాథ్
- అడ్డుకుంటున్న పోలీసులు
- ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని బలవంతంగా పంపిస్తున్న పోలీసులు
- పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాగంటి సునీత గోపీనాథ్, కార్పొరేటర్ హేమ
వెంగళరావు నగర్లో ఉద్రిక్తత
- వెంగళరావు నగర్ డివిజన్ పరిధిలో ఉద్రిక్తత
- బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఘర్షణ
- బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారని కాంగ్రెస్ ఆరోపణ
- కార్యకర్తల మధ్య తోపులాట
- ఆర్వోకు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలు
షేక్పేట్ డివిజన్లో ఉద్రిక్తత
- పోలీసులతో కాంగ్రెస్ నేత సత్యనారాయణ వాగ్వాదం
- బీఆర్ఎస్ ఏజెంట్లను బూత్లోకి పంపి తనను అడ్డుకున్నారంటూ ఆగ్రహం
- సర్దిచెప్పిన పోలీసులు
నెమ్మదిగా సాగుతున్న ఓటింగ్
- నిదానంగా సాగుతున్న జూబ్లీహిల్స్ ఓటింగ్ ప్రక్రియ
- మొదటి రెండు గంటల్లో 9.2 శాతం పోలింగ్
- గడిచిన 2 గంటల్లో ఒక్కో పోలింగ్ సెంటర్లలో 100కు మించని ఓటర్లు
- ఆఫీసులు, పనులకు వెళ్లేవాళ్లు ఓటేస్తున్న వైనం
- సాయంత్రం వరకు టైం ఉండటంతో నిదానంగా సాగే అవకాశం
రూల్స్ అతిక్రమిస్తున్న కాంగ్రెస్ నేతలు!
- పోలింగ్ బూత్ల వద్ద సంచారిస్తున్న కాంగ్రెస్ నేతలు
- ఓటు లేని వ్యక్తులు.. నియోజకవర్గం లో ఉండకూడదని ఎన్నికల నిబంధనలు
- రహమత్ నగర్లో పర్యటిస్తున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ శంకర్ నాయక్
- లైట్ తీసుకుంటున్న అధికారులు
ప్రముఖుల ఓట్లు
- జూబ్లీహిల్స్ పోలింగ్.. ఓటు హక్కు వినియోగించుకుంటున్న సినీ, రాజకీయ ప్రముఖులు
- శ్రీనగర్ కాలనీలో ఓటు హక్కు వినియోగించుకున్న బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి
- వెంకటగిరి నాజర్ స్కూల్లో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ డీజీపీ జితేందర్
9గం. 9.2 శాతం పోలింగ్
- జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కొనసాగుతున్న పోలింగ్
- 9గం. దాకా 9.2 శాతం పోలింగ్
- సాయంత్రం 6 గంటల దాకా కొనసాగనున్న పోలింగ్
- జూబ్లీహిల్స్ బరిలో 58 మంది అభ్యర్థులు
- డ్రోన్లతో పోలింగ్ బూత్ల వద్ద పర్యవేక్షణ జరుపుతున్న అధికారులు
బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. బోరబండ డివిజన్లో ఉద్రిక్తత
- కొనసాగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్
- బోరబండ డివిజన్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల వాగ్వాదం
- మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, బీఆర్ఎస్ నేతల మధ్య తోపులాట
- తమ కార్యకర్తలను బూత్ల వద్దకు వెళ్లనివ్వడం లేదని బీఆర్ఎస్ ఆరోపణ
- కాంగ్రెస్ కార్యకర్తలు టీ షర్టులు వేసుకుని ప్రచారం చేస్తున్నారన్న మండిపాటు
- అడ్డుకుని సర్దిచెప్పిన పోలీసులు
జూబ్లీహిల్స్ పోలింగ్లో ఈవీఎంల మొరాయింపు
- జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్లో మొరాయిస్తున్న ఈవీఎంలు
- రిజర్వ్ ఈవీఎంలలోనూ సాంకేతిక సమస్యలు
- క్యూ లైన్లలో వేచి చూస్తున్న ఓటర్లు
- మొత్తం 11 చోట్ల ఈవీఎం ట్రబుల్స్
కరెంట్ రావడంతో ప్రారంభమైన పోలింగ్
- శ్రీనగర్ కాలనీ నాగార్జున కమ్యూనిటీ హాల్కు కరెంట్ కట్
- చీకటితో ఆలస్యంగా ప్రారంభమైన పోలింగ్
- ఇప్పటికే క్యూ లైన్లో బారులు తీరిన ఓటర్లు
షేక్పేట డివిజన్లో ఉద్రిక్తత
- షేక్పేట డివిజన్లో ఉద్రిక్తత
- పోలీసులతో కాంగ్రెస్ నేత సత్యనారాయణ వాగ్వాదం
- బీఆర్ఎస్ ఏజెంట్లను బూత్లోకి పంపి తనను అడ్డుకున్నారని ఆగ్రహం
- సత్యనారాయణకు సర్దిచెప్పిన పోలీసులు
జూబ్లీహిల్స్ పోలింగ్, ఫస్ట్ టైం ఇలా..
- ఎన్నికల్లో మొదటిసారి అమల్లోకి వచ్చిన వచ్చిన అంశాలు
- మొదటిసారిగా ఈవీఎం లో అభ్యర్థుల కలర్ ఫోటో
- మొదటిసారి డ్రోన్లతో సెక్యూరిటీ మానిటరింగ్ చేస్తున్న అధికారులు
- ప్రతీ పోలింగ్ స్టేషన్ వద్ద మొబైల్ డిపాజిట్ సెంటర్ ఏర్పాటు
- ప్రతీ పోలింగ్ స్టేషన్ వద్ద ఓటర్ అసిస్టెన్స్ బూత్ ఏర్పాటు
- మొదటిసారి పోలింగ్ సమయాన్ని సాయంత్రం 6 గంటల వరకు పెంచిన అధికారులు
పని చేయని రిజర్వ్ ఈవీఎం!
- రెహమత్నగర్ పరిధిలో మొరాయించిన ఈవీఎంలు
- రెహమత్ నగర్ డివిజన్ 165 డివిజన్ లో మొరాయించిన EVM
- కొత్త EVM తెచ్చిన అధికారులు...అది సైతం పని చేయని వైనం
- గంట నుంచి క్యూ లైన్లో ఓటర్లు
ఓటు హక్కు వినియోగించుకున్న రాజమౌళి
- జూబ్లీహిల్స్ ఎన్నికలో ఓటేసిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి
- షేక్పేటలో ఓటు హక్కు వినియోగించుకున్న స్టార్ డైరెక్టర్
- ఇంటర్నేషనల్ స్కూల్ బూత్ నెంబర్ 28లో ఓటేసిన జక్కన్న
అంతా సెట్ చేశాం: డీఈవో ఆర్వీ కర్ణన్
- ఎర్రగడ్డ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్
- ఏజెంట్లు ఐడీ కార్డులు వేసుకోకపోవడంపై అభ్యంతరం
- ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి
- షేక్పేటలో కూడా పోలింగ్ ప్రారంభమైంది
- ఆరు పోలింగ్ కేంద్రాల్లో సమస్యలు తలెత్తాయి
- అంతా సెట్ చేశాం
- గతంలో కంటే 40 పోలింగ్ కేంద్రాల సంఖ్యను పెంచాం
- అంతా ఓటు హక్కు వినియోగించుకోవాలి
షేక్పేటలో ప్రారంభమైన పోలింగ్
- జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్.. ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు
- సరి చేస్తున్న అధికారులు
- షేక్పేట డివిజన్ బూత్ నెంబర్ 30 వద్ద ఆలస్యంగా ప్రారంభమైన పోలింగ్
మొరాయిస్తున్న ఈవీఎంలు
- జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్లో భారీగా మొరాయిస్తున్న ఈవీఎంలు
- ఎర్రగడ్డ, బోరబండ, షేక్పేట, వెంగళరావు నగర్ డివిజన్లలో ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు
- పలుచోట్ల ఇంకా ప్రారంభం కాని ఓటర్లు
- దాదాపు 11 చోట్ల ఈవీఎంలలో సమస్యలు
- క్యూ లైన్లలో ఎదురు చూస్తున్న ఓటర్లు
- ఈవీఎంలను పరిశీలిస్తున్న అధికారులు
- పోలింగ్ బూత్లలో ఇబ్బంది పడుతున్న సిబ్బంది, ఓటర్లు
ఒకే దగ్గర ఓటేయనున్న 10 వేల మంది
- యూసఫ్గూడ గవర్నమెంట్ స్కూల్లో 10 పోలింగ్ సెంటర్లు
- ఒకే దగ్గర ఓటేయనున్న 10 వేల మంది
- షేక్పేట డివిజన్లో 70 వేల మంది ఓటర్లు
- ఈ ఎన్నికతో తొలిసారి డ్రోన్ల వినియోగం
- 139 పోలింగ్ సెంటర్లలో డ్రోన్ల ద్వారా మానిటరింగ్
చీకట్లో పోలింగ్ సెంటర్
- అంధకారంలో పోలింగ్ సెంటర్
- శ్రీనగర్ కాలనీ నాగార్జున కమ్యూనిటీ హాల్కు కరెంట్ కట్
- చీకట్లో పోలింగ్ సిబ్బంది
- క్యూ లైన్లలో ఓటర్లు
ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు
- షేక్పేట డివిజన్లో ఇంకా ప్రారంభం కాని పోలింగ్
- బూత్ నెంబర్ 30లో మొరాయించిన ఈవీఎంలు
- రెహమత్నగర్లోనూ ఈవీఎంల మొరాయింపు
- 165, 166 పోలింగ్ బూత్ల్లో సాంకేతిక సమస్యలతో ఆగిన ఓటింగ్
- క్యూ లైన్లలో నిల్చున్న ఓటర్లు
- వెంగళరావు నగర్లోనూ ఇదే సమస్య
- ఈవీఎంలను పరిశీలిస్తున్న అధికారులు
కీలకంగా మారనున్న పోలింగ్ శాతం
- జూబ్లీహిల్స్లో కీలకంగా పోలింగ్ శాతం
- గత ఎన్నికల్లో ఎప్పుడూ 50 శాతం దాటని వైనం
- 2014లో 50.18%, 2018లో 45.59%, 2023లో 47.58% మాత్రమే ఓటింగ్
- గత లోక్సభ ఎన్నికల్లో.. ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 2019లో 39.89%, 2024లో 45.59% ఓటింగ్
- ఉపఎన్నిక కావడంతో పోలింగ్ శాతం పెరగొచ్చనే అంచనాలు
ఓటేసిన మాగంటి సునీత
- ఎల్లారెడ్డిగూడ పోలింగ్ కేంద్రంలో ఓటేసిన మాగంటి సునీత
- జూబ్లీహిల్స్ బరిలో బీఆర్ఎస్ తరఫున మాగంటి గోపినాథ్ సతీమణి సునీత
- ఉదయాన్నే కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న సునీత
- ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటర్లకు పిలుపు
రెహమత్ నగర్లో 59 కేంద్రాలు
- జూబ్లీహిల్స్ బై పోల్ పోలింగ్ ప్రారంభం
- రెహమత్ నగర్ డివిజన్ లో ప్రారంభమైన పోలింగ్
- రెహమత్ నగర్ లో 59 పోలింగ్ కేంద్రాలు
- పోలింగ్ కేంద్రాల వద్ద వస్తున్న ఓటర్లు
బోరబండ పోలింగ్ కేంద్రం వద్ద నిరసన
- జూబ్లీహిల్స్ బోరబండలోని పోలింగ్ స్టేషన్ 314లో నిరసన
- లైటింగ్ సరిగ్గా లేదంటూ ఏజెంట్లు, ఓటర్లు ఆగ్రహం
- పోలింగ్ సిబ్బంది నుంచి సరైన స్పందన లేదంటూ ఆరోపణ
ప్రారంభమైన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్
- ప్రారంభమైన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్
- సాయంత్రం ఆరు దాకా కొనసాగనున్న పోలింగ్
- పోలింగ్ కేంద్రాలకు ఒక్కొక్కరుగా చేరుకుంటున్న ఓటర్లు
- అభ్యర్థులు ఎక్కువగా ఉండడంతో సమయం పొడిగించిన ఎన్నికల సంఘం
- తొలిసారి డ్రోన్ల సాయంతో పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణ
జూబ్లీహిల్స్లో ఇప్పటిదాకా ఇలా..
- 2009లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఆవిర్భావం
- తొలిసారిగా కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు
- తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లో మాగంటి గోపినాథ్ విక్టరీ
- మాగంటి హఠాన్మరణంతో ఉప ఎన్నిక అనివార్యం
- ఎవరు గెలుస్తారనేదానిపై సర్వత్రా ఉత్కంఠ
జూబ్లీహిల్స్ ఓటర్లకు అలర్ట్
- జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. కాసేపట్లో ప్రారంభం కానున్న పోలింగ్
- ఉ.7గంటల నుంచి సా.6గంటల వరకు పోలింగ్
- జూబ్లీహిల్స్లో మొత్తం 4,01,365 మంది ఓటర్లు
- తీసుకెళ్లాల్సినవి.. ఓటర్ కార్డు లేకుంటే ఆధార్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు..
- పోలింగ్ స్లిప్.. కంపల్సరీ కాదు.
- ఓటర్ల జాబితాలో పేరుంటేనే ఓటేసేందుకు వీలు
- తీసుకెళ్లకూడనివి: మొబైల్ ఫోన్లు, కెమెరాలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, పార్టీ గుర్తులు, ప్రచార వస్తువులు, ఆయుధాలు, పదునైన వస్తువులు
నియోజకవర్గ ముఖచిత్రం
- ఓటర్లు: 4.01 లక్షల మంది
- మొత్తం పోలింగ్ కేంద్రాలు: 407
- సమస్యాత్మక కేంద్రాలు: 226
- అభ్యర్థులు: 58 మంది
ముగిసిన మాక్ పోలింగ్
- జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముగిసిన మాక్ పోలింగ్
- మరికాసేపట్లో మొదలుకానున్న పోలింగ్
- పోలింగ్ కేంద్రాలకు వడివడిగా చేరుకుంటున్న ఓటర్లు
మరికాసేపట్లో పోలింగ్ ప్రారంభం
- ఉప ఎన్నిక పోలింగ్ నేడే
- ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు...
- 58 మంది అభ్యర్థులు.. ముగ్గురి మధ్యే ప్రధాన పోటీ
- ప్రత్యేక యాప్లో పోలింగ్ సరళి నమోదు
- నాలుగు బ్యాలెట్ యూనిట్ల వినియోగం


