సీఎం కేసీఆర్‌ మనవడికి గాయాలు

Injuries to grandson of CM KCR - Sakshi

సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స 

సాక్షి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ మనవడు, మంత్రి కేటీఆర్‌ కుమారుడు హిమాన్షు కాలికి ఫ్యాక్చర్‌ అయినట్లు తెలిసింది. తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న అతడిని చికిత్స కోసం బుధవారం రాత్రి సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేర్పించారు. కనీసం నిలబడలేక పోతున్న హిమాన్షుకు వైద్యులు సీటీస్కాన్‌ చేశారు. తుంటి, మోకాలికి ఫ్యాక్చర్‌ అయినట్లు గుర్తించిన వైద్యులు అతనికి చికిత్సచేసి కట్టుకట్టారు. కాగా, ఇంట్లో ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడటంతో హిమాన్షు గాయపడినట్లు సెక్యూరిటీ సిబ్బంది చెబుతున్నారు.  (చదవండి: ఆ మాటలను మీడియా ఆపాదించిందన్న కేటీఆర్‌)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top