CM KCR Grandson Himanshu Injured, Admitted on Yasodha Hospital - Sakshi Telugu
Sakshi News home page

సీఎం కేసీఆర్‌ మనవడికి గాయాలు

Oct 1 2020 5:30 AM | Updated on Oct 1 2020 10:20 AM

Injuries to grandson of CM KCR - Sakshi

సీఎం కేసీఆర్‌ మనవడు, మంత్రి కేటీఆర్‌ కుమారుడు హిమాన్షు కాలికి ఫ్యాక్చర్‌ అయినట్లు తెలిసింది.

సాక్షి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ మనవడు, మంత్రి కేటీఆర్‌ కుమారుడు హిమాన్షు కాలికి ఫ్యాక్చర్‌ అయినట్లు తెలిసింది. తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న అతడిని చికిత్స కోసం బుధవారం రాత్రి సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేర్పించారు. కనీసం నిలబడలేక పోతున్న హిమాన్షుకు వైద్యులు సీటీస్కాన్‌ చేశారు. తుంటి, మోకాలికి ఫ్యాక్చర్‌ అయినట్లు గుర్తించిన వైద్యులు అతనికి చికిత్సచేసి కట్టుకట్టారు. కాగా, ఇంట్లో ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడటంతో హిమాన్షు గాయపడినట్లు సెక్యూరిటీ సిబ్బంది చెబుతున్నారు.  (చదవండి: ఆ మాటలను మీడియా ఆపాదించిందన్న కేటీఆర్‌)

Advertisement
 
Advertisement
Advertisement