హైదరాబాబాద్: నగరంలోని కూకట్పల్లిలో ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఐడీఎల్ చెరువులో దూకేసింది ఓ డిప్లొమో విద్యార్థిని. వ్యక్తిగత కారణాల వల్ల మనస్తాపానికి గురై ఆమె చెరువులో దూకినట్లు సమాచారం. కేపీహెచ్బీ ప్రాంతంలో హాస్టల్లో ఉంటోంది 20 ఏళ్ల విద్యార్థిని.
అయితే వ్యక్తిగత కారణాలతో మనస్తాపం చెందిన ఆమె.. ఐడీఎల్లో చెరువులో దూకేసింది. దీనిపై పోలీసులు వెంటనే స్పందించడంతో ఆమెను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. చెరువు మధ్యలో లోతుగా ఉన్న ప్రదేశానికి వెళ్లిపోయిన ఆ విద్యార్థిని చాకచక్యంగా కాపాడారు పోలీసులు. యువతి ప్రాణాలు కాపాడిన పోలీసులకు ఉన్నతాధికారులు అభినందనలు తెలియజేశారు.


