Hyderabad: Man Commits Suicide at Moosapet Metro Station - Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌: మూసాపేట మెట్రో స్టేషన్‌లో ఆత్మహత్య, సరిగ్గా రైలు రాగానే..

Published Fri, Jan 6 2023 12:16 PM

Hyderabad Moosapet Metro Station Man Commits Suicide - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని మూసాపేట మెట్రో స్టేషన్‌లో ఆత్మహత్య ఉదంతం చోటు చేసుకుంది. మెట్రో ట్రైన్ కింద దూకి గుర్తు తెలియని వ్యక్తి ప్రాణం తీసుకున్నాడు. గురువారం రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

టికెట్‌ తీసుకోకుండానే ఆ వ్యక్తి స్టేషన్‌లోకి ప్రవేశించినట్లు సిబ్బంది చెబుతున్నారు. నేరుగా ప్లాట్‌ఫామ్‌కు చేరుకుని.. సరిగ్గా రైలు వచ్చేది గమనించి దానికి ఎదురుగా దూకేశాడు ఆ వ్యక్తి. ఈ క్రమంలో ఇంజిన్‌కు ప్లాట్‌ఫామ్‌కు మధ్యలో బాడీ పడిపోయింది. 

ఈ ఘటన అక్కడ సీసీ ఫుటేజ్‌లో నమోదు అయ్యింది. మృతుడ్ని గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement