ఎమ్మెల్యే రాజాసింగ్‌కు హైకోర్టులో ఊరట

Goshamahal MLA Rajasingh Got Relaxaion In The High Court - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గోషామహల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పుపై స్టే విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 2016 ఉస్మానియా బీఫ్ ఫెస్టివల్  వ్యవహారంలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై సెక్షన్ 295 ఏ కింద బొల్లారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక  ఐదేళ్ల తర్వాత ఈ కేసులో రాజా సింగ్‌కు ఒక సంవత్సరం జైలు శిక్ష విధిస్తూ ఇటీవలె నాంపల్లి ప్రత్యేక కోర్టు తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ రాజాసింగ్‌ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన అనంతరం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. (రాజాసింగ్‌కు షాక్‌.. ఏడాది జైలు శిక్ష)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top