ఉడుము అనుకొని పామును లాగాడు | Farmer Dies Of Snake Bite In Nizamabad | Sakshi
Sakshi News home page

ఉడుము అనుకొని పామును లాగాడు

Jun 21 2022 4:11 PM | Updated on Jun 21 2022 4:44 PM

Farmer Dies Of Snake Bite In Nizamabad  - Sakshi

నిజామాబాద్ : ఉడుము అనుకొని పామును లాగగా అది కాటు వేయడంతో ఓ రైతు మృతి చెందాడు. ఎస్సై రాజారెడ్డి తెలిపిన వివరాలు.. మండలంలోని లింగాపూర్‌కు చెందిన కోరె లింగన్న(53) శనివారం నారుమడికి నీరు పెట్టెందుకు పొలానికి వెళ్లాడు. అక్కడ పొలం గట్టుకు ఉన్న రంధ్రంలో తోక కనిపించగా ఉడుము అనుకొని లాగాడు. అది రక్త పింజర కావడంతో బయటకు లాగగానే కాటు వేసింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతుడి భార్య సావిత్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement