కోవిడ్‌ రోగుల కోసం డియాగో విరాళం | Diego Company Donates For Coronavirus Patients | Sakshi
Sakshi News home page

కోవిడ్‌ రోగుల కోసం డియాగో విరాళం

Aug 28 2020 3:39 AM | Updated on Aug 28 2020 3:39 AM

Diego Company Donates For Coronavirus Patients - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ బారిన పడి అధిక మోతాదులో ఆక్సిజన్‌ అవసరమయ్యే రోగుల కోసం బెంగళూరుకు చెందిన డియాగో సంస్థ వంద యూనిట్ల హై ఫ్లో నాసల్‌ కాన్యులా (హెచ్‌ఎఫ్‌ ఎన్‌సీ) యంత్రాలను అందజేసింది. ఈ మేరకు సంస్థ సీఈవో ప్రథమేష్‌ మిశ్రా గురువారం బీఆర్‌కేఆర్‌ భవన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు యంత్రాలను అప్పగించారు. కోవిడ్‌ రోగులకు అత్యవసర సమయాల్లో ఉపయోగపడే ఈ యూనిట్లను గాంధీ, నిమ్స్, కింగ్‌ కోఠి, ఛాతీ ఆసుపత్రి, టిమ్స్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమైన ఆసుపత్రుల్లో ఏర్పాటు చేస్తామని సోమేశ్‌ కుమార్‌ వెల్లడించారు. కార్యక్రమంలో టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement