చిలుకూరు: చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధానార్చకుల సౌందర్ రాజన్(90) కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. ఈరోజు(శుక్రవారం, ఫిబ్రవరి 27వ తేదీ) తుదిశ్వాస విడిచారు. చిలుకూరులోని ఆయన నివాసంలోనే సౌందర్ రాజన్ కన్నుమూశారు.
దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోసం, హుండీలేని ఆధ్యాత్మిక పాలన కోసం ఆయన అలుపెరగని పోరాటం చేశారు. ఆలయంలో హుండీ లేకుండా, విఐపీ దర్శనాలు లేకుండా, అందరికీ సమానంగా స్వామి దర్శనం కల్పించే సంప్రదాయాన్ని కొనసాగించారు. ‘కళ్లు తెరిచి స్వామివారిని చూడండి, కళ్లు మూసుకుని కాదు’ అనే ఆయన మాటలు భక్తులలో విశేషంగా గుర్తింపు పొందాయి.ఆయన కుమారుడు సీఎస్ రంగరాజన్తో కలిసి ఆలయ సంప్రదాయాలను కాపాడటానికి, ఆలయ స్వతంత్రతను నిలబెట్టడానికి కృషి చేశారు.


