బీఆర్‌ఎస్‌ అనూహ్య నిర్ణయం.. కాంగ్రెస్‌లో వారికి టెన్షన్‌! | BRS Will Approach Supreme Court Over MLAs Party Change | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ అనూహ్య నిర్ణయం.. కాంగ్రెస్‌లో వారికి టెన్షన్‌!

Jun 24 2024 12:19 PM | Updated on Jun 24 2024 1:34 PM

BRS Will Approach Supreme Court Over MLAs Party Change

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై బీఆర్‌ఎస్‌ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు.

కాగా, ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్లే విషయంపై బీఆర్‌ఎస్‌ నేతలు న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. ఈనెల 27న దానం నాగేందర్‌ అనర్హత పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరుగనుంది. దానంతో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయనున్నారు.

ఇదిలా ఉండగా.. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ బీఫామ్‌తో పలువురు నేతలు విజయం సాధించారు. అనంతరం, కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో పలువురు ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరారు. ఈ నేపథ్యంలోనే బీఆర్‌ఎస్‌.. అంతకుముందు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇక, తాజాగా ఆదివారం కూడా జగిత్యాల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement