‘సీఎం కుర్చీలో రేవంత్‌ను చూడలేకపోతున్నారు’ | Congress MP Chamala Kiran Slams BRS Leaders | Sakshi
Sakshi News home page

‘సీఎం కుర్చీలో రేవంత్‌ను చూడలేకపోతున్నారు’

Jun 20 2025 4:40 PM | Updated on Jun 20 2025 5:36 PM

Congress MP Chamala Kiran Slams BRS Leaders

హైదరాబాద్‌:  ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి విషయం తక్కువ.. విషం ఎక్కువ అంటూ బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌ కౌంటర్‌ ఇచ్చారు. హరీష్‌రావుకు కంటెంట్‌ తక్కువ.. ఆవేశం ఎక్కువ అంటూ సెటైర్లు వేశారు. నీళ్ళు అనే పదంతో బీఆర్ఎస్ రాజకీయం చేసిందని, బీఆర్ఎస్ నేతలు బేసిక్ నాలెడ్జ్ తో ప్రాజెక్టులు కడితే బాగుండేదని ఎద్దేవా చేశారు.  వాళ్ల మామ కేసీఆర్‌ను హరీస్‌రావు విలన్‌ చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 

కాళేశ్వరం కూలిన తర్వాత తెలంగాణ ప్రజలకు నీళ్లు సంగతి పూర్తిగా అర్థమైంది. కేసీఆర్‌కి ఉన్న అపరజ్ఞానం వల్లే కాళేశ్వరం కూలేశ్వరం అయ్యింది. హరీష్ వైఖరి వల్లే  ఏపీ నేతలు బనకచర్లకు నీళ్ళు తరలించుకుందామనే ఆలోచన చేశారు..గోదావరి జలాలపై గొంతు చించుకునే బీఆర్ఎస్ నేతలు.. కృష్ణా జలాలపై ఎందుకు మాట్లాడరు?,  హరీష్ రావుకి కంటెంట్ కంటెంట్ తక్కువ.. ఆవేశం ఎక్కువ.  సీఎం కుర్చీలో రేవంత్‌ను బీఆర్ఎస్ నేతలుచూడలేకపోతున్నారు. 

నది జలాలు ఎవరి అయ్యా జాగీరు కాదని హరీష్ తెలుసుకోవాలి. నీళ్ళ అంశంపై తనకి తన మామకి తప్పా ఎవరికీ ఏం తెలియదని హరీష్ అనుకుంటున్నారు. తెలంగాణ నీటిని ఏపీకి దారాదత్తం చేసిందే కేసీఆర్. హరీష్ ఇరిగేషన్ మినిష్టర్ గా ఉన్నప్పుడే ఈ పంచాయితీ మొదలైంది. బనకచర్ల విషయంలో  కేంద్రం వినకపోతే సుప్రీంకోర్టు మెట్లు ఎక్కుతామని ప్రకటించిన రేవంత్ రెడ్డి కమిట్మెంట్ అర్థం చేసుకోవచ్చు. బనకచర్లపై ఏకగ్రీవ తీర్మాణం చేద్దామని అనుకునే సమయానికి ఆల్ పార్టీ మీటింగ్ నుండి బీఆర్ఎస్ ఎంపీ వాకౌట్ చేసారు. బేస్ వదిలి దోచుకునే ప్రయత్నం చేశారు కాబట్టే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టారు. బేసిక్స్ కాదు మాకు ఎథిక్స్ ఉన్నాయి కాబట్టే ప్రజలు మాకు పట్టం కట్టారు’ అని ఎంపీ చామల కిరణ్‌ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement