సాక్షి, హైదరాబాద్ : ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జిల్లా కోర్టులకు బాంబు బెదరింపుల రావడం రేపింది. తెలంగాణాలోని ములుగు జిల్లాకోర్టుకు, ఆంధ్రప్రదేశ్లోని కృష్టాజిల్లా, మచిలీపట్నంలోని జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
ములుగు జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపులు
ములుగు జిల్లా కోర్టులో బాంబు పెట్టామంటూ ఆగంతకుడు ఈమెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన కోర్టు సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో బాంబ్ స్క్వాడ్తో వచ్చిన పోలీసులు కోర్టుతోపాటు పరిసరాలను తనిఖీ శారు. ఈ సందర్బంగా లాయర్లు, ఉద్యోగులు, కక్షిదారులను బయటకు పంపించివేశారు.
కృష్ణాజిల్లా : మచిలీపట్నం జిల్లా కోర్ట్ జిల్లా ప్రధాన న్యాయమూర్తికి మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. జిల్లా జడ్జి ఫిర్యాదుతో తనిఖీలు చేపట్టారు.
ఇదీ చదవండి: రూ. 25 కోట్లు : జంట ఘరానా మోసం.. చివరికి


