ఉమ్మడి రాష్ట్రంలో పర్యాటక రంగంపై నిర్లక్ష్యం: శ్రీనివాస్‌ గౌడ్‌

Boating In Wyra Reservoir Launched To Boost Tourist - Sakshi

వైరాలో ఇండోర్‌ స్టేడియం, బోటింగ్‌ ప్రారంభం   

వైరా: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పర్యా టక రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని, తెలంగాణ ఉద్యమ సమయంలో తాను ఖమ్మం జిల్లాకు వచ్చి నప్పటికి.. ఇప్పటికీ అభివృద్ధిలో ఎంతో తేడా ఉందని మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ఖమ్మం జిల్లా వైరాలో రూ.89 లక్షలతో నిర్మించిన ఇండోర్‌ స్టేడియాన్ని, వైరా రిజర్వాయర్‌ వద్ద టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు స్పీడ్‌ బోట్లను ఆదివారం ఆయన ప్రారంభించారు.

అనంతరం మాట్లాడుతూ.. వైరా రిజర్వాయర్‌ను పర్యాటక ప్రాంతంగా మరింత అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఇదిలా ఉండగా వైరాలో ఇండోర్‌ స్టేడియం ప్రారంభించాక మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతుండగా, ఉపాధి హామీ ఫీల్ట్‌ అసిస్టెంట్లు తమను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. దీంతో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, పువ్వాడ వారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top