
హనుమకొండ: తెలంగాణ రాష్ట్రంలో ఓ ఇంజినీర్ ఏసీబీకి చిక్కారు. హనుమకొండలో ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగంలో గురువారం(సెప్టెంబర్ 25వ తేదీ) ఏసీబీ సోదాలు నిర్వహించగా అసిస్టెంట్ ఇంజనీర్ రమేష్ పట్టుబడ్డారు.
కొడకండ్లలో స్కూల్ భవనం బిల్లుల మంజూరు కోసం 18వేలు లంచం అడిగి ఏసీబీకి దొరికిపోయారు రమేష్. . రూ.8వేలు తీసుకుంటు పట్టుబడ్డారు ఇంజినీర్ రమేష్. గతంలో రూ. 10 వేలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జనగామ డీఈవో ఆఫీస్లో రమేష్ పని చేస్తున్నారు.