తెలంగాణలో కొత్తగా 1,451 పాజిటివ్‌ కేసులు

1451 New Coronavirus Cases Recorded In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 42,497 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 1,451 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,20,675 కు చేరింది. వైరస్‌ బాధితుల్లో తాజాగా 9 మంది మరణించడంతో.. ఇప్పటివరకు మొత్తం 1265 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. కోవిడ్‌ నుంచి కొత్తగా 1,983 మంది కోలుకోవడంతో ఆ సంఖ్య 1,96,636కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 22,774 యాక్టివ్‌ కేసులున్నాయి. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ శనివారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ( నిర్లక్ష్యానికి ఫలితం.. కోటి టెస్ట్‌లు )

ఇప్పటివరకు 37,89,460 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని బులెటిన్‌లో వెల్లడించింది. కరోనా రోగుల రికవరీ రేటు భారత్‌లో 87.7 శాతం ఉండగా.. రాష్ట్రంలో 89.1 శాతంగా ఉందని తెలిపింది. అదే సమయంలో దేశంలో కరోనా మరణాల రేటు 1.5 శాతం ఉండగా.. తెలంగాణలో 0.57 శాతంగా ఉందని పేర్కొంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top