మార్చి 8న స్కాలర్‌ షిప్‌ టెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

మార్చి 8న స్కాలర్‌ షిప్‌ టెస్ట్‌

Feb 26 2026 7:40 AM | Updated on Feb 26 2026 7:40 AM

మార్చి 8న స్కాలర్‌ షిప్‌ టెస్ట్‌

మార్చి 8న స్కాలర్‌ షిప్‌ టెస్ట్‌

సాక్షి, చైన్నె: ది టైమ్‌ ఎంట్రన్స్‌ కోచింగ్‌ విభాగం 2027–28 సంవత్సరానికి గాను క్లాట్‌ అభ్యర్థుల కోసం రూపొందించిన ఓపెన్‌ మాక్‌ కమ్‌ స్కాలర్‌ షిప్‌ పరీక్ష తేదీని బుధవారం ప్రకటించింది. మార్చి 8వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ఆన్‌లైన్‌, ఆఫ్‌ లైన్‌ వేదికగా ఒకే సమయంలో జరుగుతుందని వివరించారు. ఇది క్లాస్‌ సిలబస్‌ ప్రకారం 2 గంటల వ్యవధిలో 120 ఎంసీక్యూ ఆధారిత ప్రశ్నలను కలిగి ఉంటుంది. ఈ పరీక్షకు ప్లస్‌– 1, ప్లస్‌ – 2 తరగతులలో ఉన్న విద్యార్థులు, అలాగే క్లాట్‌ 2027 లేదా 2028కు సిద్ధమవుతున్నవారు అర్హులుగా ప్రకటించారు. పరీక్షకు సిద్ధమయ్యే వారు టైమ్‌ వెబ్‌సైట్‌లో పేర్లను నమోదు చేసుకోవచ్చు అని సూచించారు.

నేడు ఐఎన్‌ఎస్‌ అంజదీప్‌ యుద్ధనౌక జాతికి అంకితం

కొరుక్కుపేట: ఐఎన్‌ఎస్‌ అంజదీప్‌ యుద్ధనౌకను ఈనెల 27న జాతికి అంకితం చేయనున్నారు. దీని కోసం, చైన్నె ఓడరేవులో జరిగే కార్యక్రమంలో ఐఎన్‌ఎస్‌ అంజదీప్‌ యుద్ధనౌకను భారత నావికాదళం తూర్పు కమాండ్‌కు అధికారికంగా జతచేయనున్నారు. ఈ వేడుకకు నేవీ కమాండర్‌ దినేష్‌ కె. త్రిపాఠి అధ్యక్షత వహిస్తారు. యాంటీ సబ్‌మైరెన్‌ వార్‌ఫేర్‌ ప్రోగ్రామ్‌ కింద నిర్మిస్తున్న ఎనిమిది నౌకల్లో ఐఎన్‌ఎస్‌ అంజదీప్‌ మూడవది. ఇది శత్రు జలాంతర్గాలను గుర్తించి దాడి చేయగలదు. ఇది తీరప్రాంత, నిస్సార సముద్ర వాతావరణాల సవాళ్లను ఎదుర్కోవడానికి రూపొందించబడిన అత్యాధునిక నౌక. శత్రు జలాంతర్గాములను గుర్తించడం, ట్రాక్‌ చేయడం, నాశనం చేయడం లక్ష్యంగా ఇది నిస్సార తీరప్రాంతాలలో పనిచేస్తుంది. 77 మీటర్ల పొడవున్న ఈ కట్‌–థ్రోట్‌ నౌకలో హై–స్పీడ్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్‌ ఉంది. ఇది హై–స్పీడ్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్‌తో అమర్చబడి ఉంటుంది. ఇది 25 నాట్ల వేగాన్ని సులభంగా చేరుకోవడానికి సహాయపడుతుంది. నేవీలో ఏకీకరణ వల్ల తమిళనాడు–పుదుచ్చేరి ప్రాంతంతో సహా భారతదేశ విస్తృత సముద్ర ప్రయోజనాలను, తీరప్రాంత విధానాలను రక్షించే నావికాదళ సామర్థ్యం పెరుగుతుందని భారత నావికాదళాన్ని గణనీయంగా బలోపేతం చేస్తుందని, దానిని బలమైన శక్తిగా మార్చడంలో మరో ముఖ్యమైన అడుగును సూచిస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది.

అన్బుమణికి నోటీసులు

సాక్షి, చైన్నె : పీఎంకే నేత అన్బుమణికి సివిల్‌కోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. పీఎంకే మామిడి చిహ్నం విషయంపై వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. వివరాలు.. పీఎంకే తనదంటే తనదంటూ ఆపార్టీ వ్యవస్థాపకుడు రాందాసు, ఆయన వారసుడుఅన్బుమణి మధ్య గురించి సమరం తెలిసిందే. ఎన్నికల కమిషన్‌ ద్వారా పార్టీని, పార్టీ గుర్తు మామిడి చిహ్నంను అన్బుమణి తన గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. దీనిని వ్యతిరేకిస్తూ రాందాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా చుక్కెదురైంది. సివిల్‌ కోర్టును ఆశ్రయించాలని హైకోర్టు ఆదేశించడంతో ఆ దిశగా రాందాసు ప్రయత్నాలు చేపట్టి పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ బుధవారం విచారణకు రాగా, వివరణ ఇవ్వాలని అన్బుమణికి కోర్టు నోటీసులు జారీ చేసింది.

విజయవంతంగా నేషనల్‌ డ్రోన్‌ డెవలప్‌మెంట్‌ ఛాలెంజ్‌

సాక్షి,చైన్నె: భారతదేశంలో డ్రోన్‌ రంగం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో చైన్నెలోని కేసీజీ కాలేజ్‌ ఆఫ్‌ టెక్నాలజీ నేతృత్వంలో ఎస్‌ఏఈఐఎస్‌ డ్రోన్‌ డెవలప్‌మెంట్‌ ఛాలెంజ్‌ (ఈఈఇ) 2026 పోటీలు జరిగాయి. దేశవ్యాప్తంగా 85 ఫైనలిస్ట్‌ జట్లు పాల్గొని తమ సాంకేతిక నైపుణ్యాన్ని ప్రదర్శించాయి. ఈ జాతీయ స్థాయి పోటీని ఎస్‌ఏఈ ఇండియా దక్షిణ సెక్షన్‌, ఏరోనాటికల్‌, ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌ విభాగంతో కలిసి నిర్వహించింది. వాస్తవ ప్రపంచ అంతరిక్ష , విమానయాన ప్రమాణాలను అనుసరించేలా ఈ పోటీ రూపకల్పన చేశారు. ఈ కార్యక్రమానికి డీజీసీఏ చైన్నె డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ ఆర్‌. రాజేంద్రన్‌, అలాగే ఇస్రో మాజీ మిషన్‌ డైరెక్టర్‌ సుందరమూర్తి టీకే వంటి ప్రముఖులు హాజరయ్యారు. విద్యార్థుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఆవిష్కరణలకు నియంత్రణ సంస్థలు, అంతరిక్ష రంగం నుంచి లభిస్తున్న మద్దతు ఈ కార్యక్రమం ద్వారా స్పష్టంచేవారు. హిందూస్తాన్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఆనంద్‌ జాకబ్‌ వర్గీస్‌ మాట్లాడుతూ, భారతదేశంలో డ్రోన్‌ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. విద్యార్థులు నిజ జీవిత వ్యవస్థలను నిర్మించి, పరీక్షించి, ద్రువీకరించగల వేదికలను సృష్టించడం తమ లక్ష్యంగా పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పాల్గొన్న జట్లలో విజేతలను ప్రకటించి, అత్యుత్తమ సాంకేతిక ఆవిష్కరణలకు పురస్కారాలు ప్రదానం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement