ఏటీఎంలో నగదు చోరీకి యత్నం
వేలూరు: తిరుపత్తూరు జిల్లా ఆలంగాయం సమీపంలోని వెల్లైకుట్ట గ్రామంలో ఏటీఎంను మంగళవారం రాత్రి దుండగులు ధ్వంసం చేసి నగదు చోరీ చేసేందుకు ప్రయత్నించారు. శబ్దం విన్న స్థానికులు బయటకు రావడంతో దుండగులు పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. సీసీటీవీ పుటేజీలను చూడగా వాటిని దుండగులు తీసుకెళ్లినట్లు తెలిసింది. ఏటీఎంలోని వేలి ముద్రలను సేకరించారు. బ్యాంకు అధికారులను రప్పించి విచారణ జరిపారు. ఏటీఎం కేంద్రంలో రూ: 4.50 లక్షల నగదు ఉన్నట్టు అధికారులు తెలిపారు. రెండు రోజులుగా ఖాతాదారులు డ్రా చేయడంతో ప్రస్తుతం రూ: 3.50 లక్షల నగదు ఉన్నట్లు గుర్తించారు. తిరువణ్ణామలై జిల్లాలో గత మాసంలో నాలుగు ఏటీఎం కేంద్రాలను గ్యాస్ వెల్డింగ్ ద్వారా ధ్వంసం చేసి రూ.75 లక్షలు చోరీ చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఈ కేసులో ఏడుగురిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. తిరువణ్ణామలై, వేలూరు, తిరుపత్తూరు, రాణిపేట జిల్లాల ప్రత్యేక పోలీస్ బృందాలు ప్రత్యేక నిఘా ఉంచారు. ఈ నేపథ్యంలోనే తిరుపత్తూరులో ఏటీఎం కేంద్రాన్ని ధ్వంసం చేసి చోరీకి యత్నించిన సంఘటన సంచలనం రేపింది.
ఏటీఎం కేంద్రం వద్ద విచారణ చేస్తున్న పోలీసులు, వేలి ముద్రలు సేకరిస్తున్న నిపుణులు