
ధాన్యం కొనుగోళ్లు త్వరగా ప్రారంభించాలి
చివ్వెంల(సూర్యాపేట) : ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లను త్వరగా ప్రారంభించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు సూచించారు. గురువారం చివ్వెంల మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసి మాట్లాడారు. రైతులు ఆరబెట్టిన ధాన్యం తీసుకవచ్చి మద్దతు ధర పొందాలన్నారు. తేమశాతం 17 రాగానే సీరియల్ ప్రకారం తూకం వేయాలన్నారు. కాంటా వేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా సివిల్ సప్లయ్ అధికారి రాజేశ్వర్, నిర్వాహకులు కృష్ణారెడ్డి, మహేందర్ పాల్గొన్నారు.