జాతీయ స్థాయిలో గుర్తింపు తెస్తా | - | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయిలో గుర్తింపు తెస్తా

Apr 5 2025 1:34 AM | Updated on Apr 5 2025 1:34 AM

జాతీయ

జాతీయ స్థాయిలో గుర్తింపు తెస్తా

సూర్యాపేటటౌన్‌ : రాష్ట్రంలోని వైద్య కళాశాలలను పటిష్టవంతంగా తీర్చిదిద్దుతామని, సూర్యాపేట మెడికల్‌ కళాశాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొస్తానని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాల స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సూర్యాపేట మెడికల్‌ కళాశాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు. కళాశాల నిర్వాహకుల అభ్యర్థన మేరకు కళాశాల ప్రాంగణంలో 1000 సీట్లతో కూడిన ఆడిటోరియం నిర్మాణానికి శ్రీకోటి రూపాయలను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా విద్యార్థుల సౌకర్యార్థం రెండు బస్సులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. సమాజానికి వైద్య సేవలు అందించడంలో వైద్య విద్యార్థుల పాత్ర కీలకంగా ఉందన్నారు. ఎంబీబీఎస్‌ పూర్తి చేసుకున్న విద్యార్థులను ఆయన అభినందించారు. ప్రజల ఆరోగ్య బాధ్యత వైద్య విద్యార్థుల భుజస్కందాలపై ఉందనే విషయాన్ని విస్మరించకూడదన్నారు. ఈ సందర్భంగా 2019–2025లో ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన మొదటి బ్యాచ్‌ 150 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు, మెడల్స్‌ అందజేశారు.

అద్బుతమైన మెడికల్‌ కళాశాల

భవనాన్ని నిర్మించుకున్నాం

సూర్యాపేటలో అద్భుతమైన ప్రభుత్వ మెడికల్‌ కళాశాల భవనాన్ని నిర్మించుకున్నామని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. ఆనాడు మెడికల్‌ కాలేజీ అనగానే వెంటనే ఎగ్జిబిషన్‌ సొసైటీతో మాట్లాడి అనుమతి తీసుకున్నామని, విద్యార్థులు ఒక్క ఇయర్‌ కూడా నష్టపోకూడదని 2019 లోనే ప్రారంభించుకున్నామని తెలిపారు. కరోనా సమయంలో అద్భుతమైన సేవలు అందించిన ఘనత మన మెడికల్‌ కళాశాలకే దక్కిందన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే మందుల సామేలు, కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌, ఎస్పీ నరసింహ, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొప్పుల వేణారెడ్డి, ప్రిన్సిపాల్‌ జయలత, కేఎన్‌ఆర్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ నందకుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఫ సూర్యాపేట మెడికల్‌ కళాశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి

ఫ ఆడిటోరియం నిర్మాణానికి రూ.కోటి మంజూరు చేస్తున్నట్లు ప్రకటన

ఫ ప్రభుత్వ మెడికల్‌ కళాశాల

స్నాతకోత్సవంలో

మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి

చాలా ఆనందంగా ఉంది

సూర్యాపేట ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసుకున్నా. నాలుగేళ్లు కష్టపడి చదివి ఎన్నో విషయాలు తెలుసుకున్నా. సర్టిఫికెట్‌ అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. పీజీ పూర్తి చేసి రోగులకు నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు పాటుపడతా.

– అనిల్‌కుమార్‌ యాదవ్‌, కూకట్‌పల్లి

అదృష్టంగా భావిస్తున్నా

సూర్యాపేట మెడికల్‌ కళాశాల ప్రారంభం మొదటి బ్యాచ్‌ 2019లో చేరాను. ఎంబీబీఎస్‌ పూర్తి చేసుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నా. పీజీ చేసి మంచి సర్జన్‌ అవుతా. పేద వారికి నాణ్యమైన వైద్యం అందించి మన్ననలు పొందుతా.

– రామటెంకి విజయ్‌, మంచిర్యాల

చాలా గర్వంగా ఉంది

ఎంబీబీఎస్‌ పూర్తి చేసుకోవడం చాలా గర్వంగా ఉంది. కళాశాలలో అన్ని వసతులు ఉన్నాయి. ప్రొఫెసర్లు మంచి నాణ్యమైన విద్యనందించారు. మెరుగైన వైద్య సేవలందించి మంచి పేరు తెచ్చుకుంటా.

– ప్రతిమ, ఒంగోలు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం

వైద్య వృత్తి ఎంతో పవిత్రమైంది

స్నాతకోత్సవంలో ఎమ్మెల్యే మందుల సామేల్‌ మాట్లాడుతూ.. వైద్య వృత్తి చాలా పవిత్రమైందని అన్నారు. ఉస్మానియా మెడికల్‌ కళాశాల, గాంధీ మెడికల్‌ కళాశాలలో ఎంతోమంది పట్టభద్రులు బయటకి వెళ్లారని, ఇప్పుడు సూర్యాపేట మెడికల్‌ కాలేజీలో సుమారు 150 మంది విద్యార్థులు ఎంబీబీఎస్‌ పూర్తిచేసుకుని వెళ్లడం గొప్ప విషయమన్నారు. ఈ విజయం అందించిన అధ్యాపకులకు ధన్యవాదాలు తెలిపారు.

జాతీయ స్థాయిలో గుర్తింపు తెస్తా1
1/5

జాతీయ స్థాయిలో గుర్తింపు తెస్తా

జాతీయ స్థాయిలో గుర్తింపు తెస్తా2
2/5

జాతీయ స్థాయిలో గుర్తింపు తెస్తా

జాతీయ స్థాయిలో గుర్తింపు తెస్తా3
3/5

జాతీయ స్థాయిలో గుర్తింపు తెస్తా

జాతీయ స్థాయిలో గుర్తింపు తెస్తా4
4/5

జాతీయ స్థాయిలో గుర్తింపు తెస్తా

జాతీయ స్థాయిలో గుర్తింపు తెస్తా5
5/5

జాతీయ స్థాయిలో గుర్తింపు తెస్తా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement