క్యాంటిన్‌ కోసం టెండర్లు | - | Sakshi
Sakshi News home page

క్యాంటిన్‌ కోసం టెండర్లు

Mar 18 2025 9:08 AM | Updated on Mar 18 2025 9:03 AM

ఎచ్చెర్ల క్యాంపస్‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో క్యాంటిన్‌ ప్రారంభం కోసం టెండర్లు పిలిచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. విశ్వవిద్యాలయంలో గత కొన్నేళ్లుగా క్యాంటిన్‌ నిర్వహించడం లేదు. దీంతో అధ్యాపకులు, సిబ్బంది అల్పాహారం కోసం ఎచ్చెర్ల గ్రామంలోకి వెళ్తున్నారు. దీంతో క్యాంటిన్‌ నిర్వహిస్తే ఆదాయం వస్తుందని అధికారులు భావిస్తున్నారు. క్యాంటిన్‌ వల్ల వర్సిటీ వర్గాలకు అల్పాహారం, స్నాక్స్‌, ఇతర ఆహార పదార్థాలు అందుబాటులోకి వస్తాయి.

పేదల విద్యపై కక్ష తగదు

వైఎస్సార్‌సీపీ కళింగ కుల

రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరావు

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): పేదల విద్యపై కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్‌సీపీ కళింగ కుల రాష్ట్ర అధ్యక్షుడు దుంపల లక్ష్మణరావు సోమవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. పదిమంది లోపు విద్యార్థులు ఉండే ప్రాథమిక పాఠశాలలు మూసేవేయాలని నిర్ణయం తీసుకోవడం తగదన్నారు. పంచాయతీకి ఒక ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేస్తే, కొన్ని గ్రామాల్లో దాదాపు 5 కి.మీ దూరం వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పిస్తామని నమ్మబలుకుతున్నారని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 3వ తరగతి నుంచే సబ్జెక్ట్‌ టీచర్స్‌ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. నాడు–నేడు పేరుతో కార్పొరేట్‌ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దినట్లు తెలియజేశారు. అలాగే పేదలకు ఇంగ్లిష్‌ మీడియం విద్య అందడం సీఎం చంద్రబాబుకు ఇష్టం లేదని మండిపడ్డారు. ఇప్పటికే తల్లికి వందనం పథకానికి తక్కువ నిధులు కేటాయించి మోసం చేసేందుకు పూనుకున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలు 17కి గాను 7పూర్తి కాగా, మరో 10 కాలేజీలను ప్రైవేటుపరం చేయాలని కూటమి ప్రభుత్వం ఆలోచన చేయడం దారుణమన్నారు. ఇప్పటికై నా తీరు మార్చుకోకపోతే ప్రజాగ్రహం తప్పదని హెచ్చరించారు.

అంగన్‌వాడీలను సక్రమంగా నిర్వహించాలి

పలాస: అంగన్‌వాడీలను సక్రమంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ చైర్మన్‌ కె.అప్పారావు సూచించారు. మండలంలోని రంగోయి, పెంటిభద్ర అంగన్‌వాడీలు, బాలసదనం తదితర కేంద్రాలను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రాల్లో ఉన్న బాలింతలు, బాలలు, గర్భిణులతో మాట్లాడి అందుతున్న సదుపాయాలపై ఆరా తీశారు. కేంద్రాల్లో మౌలిక వసతులపై సంతృప్తి వ్యక్తం చేశారు. పెంటిభద్రలో శిథిలావస్థలో ఉన్న బావిని పూడ్చాలని ఎంఈవో శ్రీనివాసరావును ఆదేశించారు. ఆయనతో పాటు బాలల సంక్షేమ సమితి చైర్‌పర్సన్‌ యు.శ్రీలక్ష్మి, సభ్యుడు ఎం.గన్నప్పుడు, జిల్లా బాలల రక్షణాధికారి మెట్ట మల్లేశ్వరరావు, జీసీడీవో ఎస్‌.నీరజ, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్లు యు.లత, ఎస్‌.సరస్వతీ, గంగమ్మ తదితరులు ఉన్నారు.

ఎస్పీ గ్రీవెన్స్‌కు 63 వినతులు

శ్రీకాకుళం క్రైమ్‌ : ఎంతో దూరం నుంచి వ్యయ ప్రయాసలకోర్చి వచ్చే ప్రజల సమస్యల పట్ల పోలీసు అధికారులు ప్రాధాన్యతనివ్వాలని, చట్టపరిధిలో విచారణ జరిపి పరిష్కరించాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కార్యక్రమంలో వచ్చిన 63 వినతులను ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం అధికారులకు పై విధంగా ఆదేశాలు జారీ చేస్తూ స్టేషన్‌లు చుట్టూ పలుమార్లు తిప్పించుకోవద్దని హితవు పలికారు.

మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి

పొందూరు: చేనేత మహిళలు స్వయం శక్తితో ఆర్థికాభివృద్ధి సాధించాలని సిక్కోలు వీవర్స్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ ముఖ్య కార్యనిర్వహణాధికారి బి.అప్పలనాయుడు ఆకాంక్షించారు. స్థానిక దేవాంగ సంఘ గ్రంథాలయంలో నాబార్డు ఆధ్వర్యంలోని ఆర్ట్సు స్వచ్ఛంద సంస్థ సోమవారం ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ సంస్థ చేనేత, రైతు మహిళలకు పెద్దపీట వేస్తోందన్నారు. తమ సంస్థలో చేనేత విభాగంలో 515 మంది సభ్యులు ఉన్నారని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు పొందిన జల్లేపల్లి కాంతమ్మతో పాటు మరో 60 మంది చేనేత కార్మికులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆర్ట్స్‌ సంస్థ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్‌ కుప్పిలి పద్మ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

క్యాంటిన్‌ కోసం టెండర్లు 1
1/2

క్యాంటిన్‌ కోసం టెండర్లు

క్యాంటిన్‌ కోసం టెండర్లు 2
2/2

క్యాంటిన్‌ కోసం టెండర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement