ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో శ్రీకాంత్‌ శిష్య బృందం నాట్య ప్రదర్శన | - | Sakshi
Sakshi News home page

ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో శ్రీకాంత్‌ శిష్య బృందం నాట్య ప్రదర్శన

Jan 18 2026 7:09 AM | Updated on Jan 18 2026 7:09 AM

ఢిల్ల

ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో శ్రీకాంత్‌ శిష్య బృందం నాట్య ప

ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో శ్రీకాంత్‌ శిష్య బృందం నాట్య ప్రదర్శన శ్రీకాకుళం కల్చరల్‌: దేశ రాజధాని న్యూ ఢిల్లీలో ని కర్తవ్య పథ్‌లో నిర్వహించబోతున్న గణతంత్ర దినోత్సవంలో ప్రదర్శించబోయే సాంస్కృతిక కార్యక్రమాల్లో మన జిల్లాలోని ప్రముఖ నాట్యాచార్యుడు రఘుపాత్రుని శ్రీకాంత్‌ శిష్య బృందం ప్రదర్శన ఇవ్వనుంది. శివ శ్రీ నృత్య కళానికేతన్‌ సంస్థ నుంచి మన కూచిపూడి సంప్రదాయంలో ఐదుగురు, భరతనాట్యం సంప్రదాయంలో ఎనిమిది మంది పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహించే గొప్ప అవకాశాన్ని దక్కించుకున్న ఈ బృందంలో కూచిపూడి విభాగంలో నేహా, వర్షిత, శ్రే యశ్రీ, బిందు, లలితలు, భరతనాట్యం విభాగంలో అన్నా నేహా థామస్‌, సుష్మ, సంజన, శ్రీవల్లి, శ్రావణి, జోత్స్న, పవిత్ర, శ్రీ సాయి లక్ష్మి పాల్గొననున్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో ఉద్యోగాల భర్తీ

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో ఖాళీగా ఉన్న డేటా ఎంట్రీ ఆపరేటర్‌, ఫ్రంట్‌ ఆఫీస్‌ కో ఆర్డినేటర్‌, రికార్డు అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. మొత్తం నాలుగు పోస్టులను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ పద్ధతిలో భర్తీ చేయనుండగా, ఇందులో రికార్డు అసిస్టెంట్‌ విభాగంలో రెండు (ఓసీ–1, ఎస్సీ– 1), మిగిలిన రెండు విభాగాల్లో ఒక్కోటి చొప్పు న (ఓసీ) ఖాళీలు ఉన్నాయి. ఎంపికై న వారికి పోస్టును బట్టి నెలకు రూ.23,120 నుంచి రూ.89,720 వరకు వేతన శ్రేణి వర్తిస్తుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు జిల్లా కోర్టు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తులను డౌన్‌లోడ్‌ చేసుకుని, పూర్తి చేసిన ఫారమ్‌లను ఈనెల 27వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తులను కేవలం రిజిస్టర్‌ పోస్ట్‌ లేదా స్పీడ్‌ పోస్ట్‌ ద్వారా మాత్రమే ‘చైర్మన్‌, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, శ్రీకాకుళం’ చిరునామాకు పంపాలని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్హతలు, వయోపరిమితికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అభ్యర్థులు జిల్లా కోర్టు వెబ్‌సైట్‌ను http:srikakulam.ecourts. gov.in సంప్రదించాలి. దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ ఈ నెల 27 అని పేర్కొన్నారు.

ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో శ్రీకాంత్‌ శిష్య బృందం నాట్య ప1
1/1

ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో శ్రీకాంత్‌ శిష్య బృందం నాట్య ప

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement