
● నేడు మదీనా దర్గా చందనోత్సవం
గార: కళింగపట్నం పరిధి నగరాలపేట వద్దనున్న కళింగ హజరత్ మదీనా బాబా దర్గా వద్ద సో మవారం ఉరుసు చందనోత్సవం జరగనుంది. ముందు బాబా సమాధి వద్ద అభిషేకాలను నిర్వహిస్తారు. అనంతరం గత ఏడాది సమాధిపై వేసిన చందనం పూతను తొలగిస్తారు. ఎదురుగా ఉన్న ప్రార్థనా స్థలం వద్ద ముస్లిం భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేసిన తర్వాతే భక్తులకు దర్శనం ఉంటుంది. ఇక్కడ ప్రతి గురువారం హిందూ, ముస్లిం భక్తులు పాల్గొని పూజలు చేస్తారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి ప్రారంభం కానున్న ఉత్సవంలో సాయంత్రం బాబా సమాధిని కప్పి ఉంచే ప్రధానమైన వస్త్రాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి సమాధిపై ఉంచుతారు.