పేరూరు సమీపంలో ఆముదం పంటకు
ట్యాంకర్ల ద్వారా నీరందిస్తున్న రైతు
వరుణుడు తొలకర్లతో పలకరించగా మురిసిపోయిన రైతన్నలు ఉత్సాహంగా విత్తనం చేసుకున్నారు. అయితే ఆ తర్వాత
వాన జాడే కరువుకావడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అప్పుడప్పుడే భూమిని చీల్చుకుని మొలకెత్తిన పంటను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.
ఈ క్రమంలోనే రామగిరి మండలం పేరూరు సమీపంలో ఆముదం, కంది పంటలు ఎండుతుండడంతో రైతులు ఇలా ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకువెళ్లి మొక్కలకు పెడుతూ కన్నీటి సేద్యం చేస్తున్నారు. రైతన్న కష్టం పండుతుందా...
పంట ఎండుతుందా.. ఆపై వాడికే తెలియాలి. – రామగిరి:


