●రక్షణ కవచం
భూమి సారవంతం కోసం జీవాలను పొలాల్లోకి తోలడం పరిపాటి. అందులో భాగంగా పెంపకందారులు జీవాల మందను తీసుకొస్తుంటారు. రోజుల తరబడి అక్కడే ఉండాల్సి వస్తుంది. ఆ సమయంలో రాత్రిపూట దోమల మోత అధికంగా ఉంటోంది. దీనికితోడు అటవీ ప్రాంతంలోని పొలాలు అయితే నక్కలు, తోడేళ్ల బెడద తప్పదు. వీటిబారి నుంచి రక్షణ కల్పించేందుకు పెంపకందార్లు పొలంలోనే దోమతెరలతో టెంటు వేస్తున్నారు. పగలంతా మేత కోసం పొలమంతా తిరిగిన జీవాలు సాయంత్రానికి ఈ టెంటులోకి చేరుతాయి. శింగనమల నియోజకవర్గం బండ్లపల్లి వద్ద ఈ దృశ్యాన్ని ‘సాక్షి’ కెమెరా బంధించింది.
– ఫొటోగ్రాఫర్, అనంతపురం


