
ఐపీఎల్-2024 సీజన్ ఆరంభానికి కేవలం 4 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. మార్చి 22న చెపాక్ వేదికగా ఆర్సీబీ, సీఎస్కే మధ్య జరగనున్న మ్యాచ్తో ఈ ధనాధన్ లీగ్కు తెరలేవనుంది. ఈ క్రమంలో ఆటగాళ్లు ఒక్కొర్కిగా ఆయా ఫ్రాంచైజీలతో కలుస్తున్నారు. ఇప్పటికే భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఆర్సీబీ జట్టుతో చేరగా.. తాజాగా ఆసీస్ సూపర్ స్టార్ ట్రావిస్ హెడ్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో కలిశాడు.
ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవతున్నాయి. కాగా ఐపీఎల్ 2024 వేలంలో ట్రావిస్ హెడ్ను రూ.6.8 కోట్ల భారీ ధరకు ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసింది. హెడ్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్లో ఉన్నాడు. ఫార్మాట్తో సంబంధం లేకుండా అదరగొడుతున్నాడు. గతేడాది జరిగిన వన్డే వరల్డ్కప్ను ఆసీస్ కైవసం చేసుకోవడంలో హెడ్ది కీలక పాత్ర.
భారత్తో జరిగిన ఫైనల్లో సెంచరీతో చెలరేగిన హెడ్ ఆరోసారి తన జట్టును విశ్వవిజేతగా నిలిపాడు. ఇప్పుడు ఐపీఎల్లో కూడా ఈ ఆసీస్ స్టార్ మెరుపులు మెరిపించాలని సన్రైజర్స్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక ఈ ఏడాది సీజన్లో ఎస్ఆర్హెచ్ తమ తొలి మ్యాచ్లో మార్చి 23న కోల్కతా నైట్రైడర్స్తో తలపడనుంది.