Tokyo Olympics: భారత మహిళల హాకీ జట్టు విజయం; ఐర్లాండ్‌ ఓడిపోతేనే

Tokyo Olympics: Indian Womens Enters Quarter If Ireland May Lose Or Draw - Sakshi

టోక్యో: ఒలింపిక్స్‌లో భాగంగా భారత మహిళల హాకీ జట్టు మరో విజయాన్ని నమోదు చేసింది. శనివారం దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 4-3 తేడాతో విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌ ఆద్యంతం హోరాహోరీగా సాగడం విశేషం. తొలి రెండు క్వార్టర్లలో వందన కటరియా రెండు గోల్స్‌ చేయడంతో  2-1తో భారత్‌ ఆధిపత్యం ప్రదర్శించింది. అయితే మూడో క్వార్టర్‌లో మాత్రం కాస్త తడబడింది. దీంతో సౌతాఫ్రికా మూడో క్వార్టర్‌లో రెండు గోల్స్‌ నమోదు చేసి 3-3తో స్కోరును సమం చేసింది. కీలకమైన నాలుగో క్వార్టర్‌లో వందన కటారియా మరో గోల్‌తో మెరవడంతో భారత్‌ 4-3తో ఆధిక్యంలోకి వెళ్లింది.

ఆట ముగిసేలోపూ భారత ఢిపెన్స్‌ టీమ్‌ సౌతాప్రికాను మరో గోల్‌ చేయకుండా నిలువరించడంతో విజయాన్ని అందుకుంది. కాగా భారత్‌ ఈ విజయంతో లీగ్‌ దశలో ఐదు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు.. మూడు ఓటములతో కలిపి 6 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. భారత్‌ క్వార్టర్స్‌ చేరాలంటే ఐర్లాండ్‌- గ్రేట్‌ బ్రిటన్‌ల మధ్య జరగనున్న మ్యాచ్‌లో ఐర్లాండ్‌ ఓడిపోవాలి. అలా కాకుంటే మ్యాచ్‌ డ్రా అయినా భారత్‌ క్వార్టర్స్‌కు క్వాలిఫై అవుతుంది. ఒకవేళ ఐర్లాండ్‌ గెలిస్తే మాత్రం భారత మహిళల జట్టు ఇంటిముఖం పడుతుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top