IND vs SL: శ్రీలంకతో మూడో టీ20.. రుత్‌రాజ్‌కు నో ఛాన్స్‌! గిల్‌ వైపే మొగ్గు

SL vs IND 3rd T20: India won the toss elected to Bat First - Sakshi

రాజ్‌కోట్‌ వేదికగా సిరీస్‌ను డిసైడ్‌ చేసే మూడో టీ20లో భారత్‌-శ్రీలంక జట్లు తలపడేందుకు సిద్దమయ్యాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

ఇక భారత జట్టు ఎటువంటి మార్పులేమిలేకుండా బరిలోకి దిగింది. కాగా వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన గిల్‌ స్థానంలో ఆఖరి టీ20లో రుత్‌రాజ్‌ గైక్వాడ్‌కు చోటు దక్కుతుందని అంతా భావించారు. కానీ మేనేజ్‌మెంట్‌ మాత్రం గిల్‌ వైపే మొగ్గు చూపింది. ఇక శ్రీలంక మాత్రం ఒక మార్పు చేసింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన రాజపాక్స స్థానంలో అవిష్క ఫెర్నాండో తుది జట్టులోకి వచ్చాడు.

తుది జట్లు
శ్రీలంక:
పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్‌ కీపర్‌), అవిష్క ఫెర్నాండో, ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, దసున్ షనక(సి), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, దిల్షన్ మధుశంక

భారత్: ఇషాన్ కిషన్(వికెట్‌ కీపర్‌), శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, రాహుల్ త్రిపాఠి, హార్దిక్ పాండ్యా(కెప్టెన్‌), దీపక్ హుడా, అక్షర్ పటేల్, శివం మావి, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top