Ranji Trophy Semis: స్పోర్ట్స్‌ మినిస్టర్‌ సారధ్యంలో శతకాలతో విరుచుకుపడిన ప్లేయర్లు

Ranji Trophy 2022 23: Sudip, Anustup Slams Centuries In Semis Vs Madhya Pradesh - Sakshi

Ranji Trophy 2022-23 Semi Finals MP VS Bengal: రంజీ ట్రోఫీ-2022-23 సీజన్‌ చివరి అంకానికి చేరింది. ఈ దేశవాలీ టోర్నీలో ఇవాల్టి (ఫిబ్రవరి 8) నుంచే సెమీఫైనల్‌ మ్యాచ్‌లు మొదలయ్యాయి. తొలి సెమీస్‌లో బెంగాల్‌.. మధ్యప్రదేశ్‌ను ఢీకొంటుంటే, రెండో సెమీస్‌లో కర్ణాటక, సౌరాష్ట్ర జట్లు పోటీ పడుతున్నాయి.

తొలి సెమీస్‌ విషయానికొస్తే.. స్పోర్ట్స్‌ మినిస్టర్‌ మనోజ్‌ తివారి సారధ్యంలో బెంగాల్‌ జట్టు తొలి రోజు ఆటలో పైచేయి సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న బెంగాల్‌.. సుదీప్‌ కుమార్‌ ఘరామీ (112), అనుస్తుప్‌ మజుందార్‌ (120) శతకాలతో విరుచుకుపడటంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది.

ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్‌ (27), కరణ్‌ లాల్‌ (23)లకు మంచి శుభారంభాలు లభించినప్పటికీ వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి కెప్టెన్‌ మనోజ్‌ తివారి (5), షాబజ్‌ అహ్మద్‌ (6) క్రీజ్‌లో ఉన్నారు. మధ్యప్రదేశ్‌ బౌలర్లలో అనుభవ్‌ అగర్వాల్‌ 2 వికెట్లు పడగొట్టగా.. ఆవేశ్‌ ఖాన్‌, గౌరవ్‌ యాదవ్‌కు చెరో వికెట్‌ దక్కింది.      

                                                                                                                                                                           

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top