భారత్‌పై ఇంగ్లండ్ విజయం | England Vs India: England victory over India | Sakshi
Sakshi News home page

England Vs India: భారత్‌పై ఇంగ్లండ్ విజయం

Jul 4 2026 10:48 PM | Updated on Jul 4 2026 11:18 PM

England Vs India: England victory over India

మాంచెస్టర్ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా పై ఇంగ్లండ్‌ నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి ఇంగ్లండ్‌ జట్టు వెళ్లింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 ప‌రుగులు స్కోర్ సాధించింది. ఇషాన్‌ కిషన్‌(40 బంతుల్లో 49), అభిషేక్‌ శర్మ(43), కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌(37), తిలక్‌ వర్మ(24) రాణించారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో సామ్‌ కుర్రాన్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. జోఫ్రా ఆర్చర్‌, విల్‌ జాక్స్‌, డాసన్‌ తలా వికెట్‌ సాధించారు.

అనంతరం 191 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్...19 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసి గెలుపొందింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్ ఓ వికెట్ సాధించారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్‌(39),  టామ్ బాంటన్‌(39) మెరుగ్గా రాణించారు.

ఇంగ్లాండ్ జట్టుకు జాకబ్ బెథెల్ 46 బంతుల్లో 76(నాటౌట్‌) చెసి అద్భుతమైన ప్రదర్శనతో విజయాన్ని అందించాడు. రన్‌చేజ్‌లో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌ను ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ ప్రారంభించారు. అయితే ఆరంభం దారుణంగా మారింది. ఇద్దరూ డక్ అవుట్ కావడంతో జట్టు ఒత్తిడిలో పడింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో కెప్టెన్ హ్యారీ బ్రూక్ అద్భుతంగా ఆడాడు. కేవలం 15 బంతుల్లోనే 39 పరుగులు సాధించి ఇన్నింగ్స్‌ను స్థిరపరిచాడు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement