
ఆయిల్ పామ్ ఎంతో లాభదాయకం
కొండపాక(గజ్వేల్): ఆయిల్ పామ్ సాగు ఎంతో లాభదాయకమని కలెక్టర్ హైమావతి అన్నారు. ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్లో భాగంగా మంగళవారం మండలంలోని బందారంలో రైతు నర్రా జైపాల్రెడ్డికి చెందిన 10 ఎకరాల భూమిలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయిల్ పామ్ తోటల సాగుకు అవసరమయ్యే పరికరాలను ప్రభుత్వం సబ్సిడీపై అందజేస్తుందన్నారు. అధిక ఆదాయం ఇచ్చే ఆయిల్ పామ్ సాగుకు రైతులు మొగ్గుచూపాలన్నారు. 10 ఎకరాల్లో సాగు చేసేందుకు ముందుకు వచ్చిన రైతు జైపాల్రెడ్డిని కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో హార్టికల్చర్, పట్టు పరిశ్రమ అధికారి సువర్ణ, ఆయిల్ ఫెడ్ మేనేజర్ భాస్కర్రెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సాగుకు రైతులు మొగ్గుచూపాలి
కలెక్టర్ హైమావతి
భూ సమస్యలు పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు
భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని కలెక్టర్ హైమావతి అన్నారు. అంకిరెడ్డిపల్లిలో మంగళవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సును సందర్శించి దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా హైమావతి మాట్లాడుతూ చాలా కాలంగా పెండింగ్లో ఉంటున్న భూ సమస్యలు పరిష్కారమయ్యేలా ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన ప్రతీ దరఖాస్తు పూర్తి వివరాలను ఆన్లైన్లో పొందుపర్చనున్నట్లు తెలిపారు.