
ఆటలు ఆడించేవారేరీ?
జిల్లా వ్యాప్తంగా పీఈటీల కొరత
క్రీడలు.. శారీరక, మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని చెప్పే ప్రభుత్వం.. ఆచరణలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తోంది. అందుకు నిదర్శనం పీఈటీల కొరత తీర్చకపోవడమే. క్రీడా సామగ్రి, సరైన క్రీడాసదుపాయాలు లేక గ్రామీణ విద్యార్థులు ఆటలకు దూరమవుతున్నారు. దీంతో ప్రతిభా ఉన్నా శిక్షణ లేక ఆటల్లో రాణించలేకపోతున్నారు.
చేర్యాల(సిద్దిపేట): జిల్లాలో 10 ప్రభుత్వ ఉన్నత, 217 జెడ్పీ ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం 227 ఉన్నత పాఠశాలల్లో 31,978మంది విద్యనభ్యసిస్తున్నారు. కానీ జిల్లా వ్యాప్తంగా కేవలం 128 మంది పీఈటీలే ఉన్నారు. కొన్నేళ్లుగా పీఈటీలను నియమించకపోవడంతో విద్యార్థులకు ఆటలు నేర్పించే వారే కరువయ్యారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, షటిల్, క్రికెట్ వంటి ఆటలు ఆడాలని ఉన్నా శిక్షణ ఇచ్చేవారు లేరు. ప్రభుత్వం స్పందించి వెంటనే వ్యాయామ ఉపాధ్యాయులను నియమించేందుకు చర్యలు చేపట్టాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఖాళీలు చాలా ఉన్నాయి
హాస్టళ్లలో ఖాళీలు చాలా ఉన్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో అడ్మిషన్లు ప్రారంభించాం. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు హాస్టళ్లలో సదుపాయాలు, సౌకర్యాల గురించి అవగాహన కల్పిస్తాం. మూడు నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులను చేర్చుకుంటాం.
– రామస్వామి,
వార్డెన్, తిగుల్
శిక్షణ లేక రాణించలేకపోతున్నాం
సరైన శిక్షణ లేక బడిలో ఆడించే క్రీడల్లోనూ గెలవలేకపోతున్నాం. శిక్షణ ఇచ్చేవారు లేకపోవడంతో మాకు తోచిన విధంగా ఆడుతున్నాం. ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించి వెంటనే పీఈటీని నియమించాలి. శిక్షణ, ఆటవస్తువులు అందిస్తే క్రీడల్లో రాణిస్తాం.
– జశ్వంతి, 10వ తరగతి, చుంచనకోట జెడ్పీహెచ్ఎస్
నియామకం ప్రభుత్వ ప్రక్రియ
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు అవసరం. కానీ పలు పాఠశాలల్లో పీఈటీల కొరత ఉండటంతో వ్యాయామం, ఆటలు ఆడించలేకపోతున్నాం. ఖాళీల అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ప్రభుత్వం చేపట్టే నియామకాల్లో సరిపడా పీఈటీలను నియమించాలని నివేదిస్తాం.
– శ్రీనివాస్రెడ్డి, డీఈఓ

ఆటలు ఆడించేవారేరీ?

ఆటలు ఆడించేవారేరీ?

ఆటలు ఆడించేవారేరీ?