
అర్హత లేకున్నా వైద్యం చేస్తే ఫిర్యాదు
గజ్వేల్రూరల్: అర్హత లేకున్నా వైద్యం అందించే వారిపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీజీఎంసీ)కు ఫిర్యాదు చేస్తామని ఐఎంఏ ప్రతినిధులు డాక్టర్ లింగం, చంద్రారెడ్డి, పెంటాచారిలు అన్నారు. మంగళవారం రాత్రి గజ్వేల్ ఐఎంఏ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని కోర్టు సమీపంలోగల ఐ ఆసుపత్రి, సంగాపూర్ మార్గంలోని పల్స్, ఆక్సీకేర్, సన్రైజ్, మెడినోవ తదితర ఆస్పత్రులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐ ఆస్పత్రితో పాటు ఆక్సీకేర్, ఆసుపత్రిలో అర్హతలేని వారు చికిత్స అందిస్తున్నట్లు తమ పరిశీలనలో తేలిందని, పల్స్ ఆసుపత్రితో పాటు మరికొన్ని ఆస్పత్రులలో విద్యార్హతకు మించి వైద్యం చేస్తున్నట్లు గుర్తించామని, ఆయా ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించాలని సూచించినట్లు తెలిపారు. ప్రజలు అర్హత లేని వైద్యుల వద్ద చికిత్స చేయించుకొని ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దని, అర్హత లేకుండా వైద్యం చేస్తున్న వారిపై టీజీఎంసీతో పాటు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో గజ్వేల్ ఐఎంఏ ప్రతినిధులు డాక్టర్ నాగమున్నయ్య పాల్గొన్నారు.
ఐఎంఏ ప్రతినిధుల హెచ్చరిక
గజ్వేల్లోని
పలు ప్రైవేటు ఆస్పత్రుల తనిఖీ