
యోగా ఏకాగ్రతను పెంచుతుంది
కొండపాక(గజ్వేల్): యోగా ఏకాగ్రతను పెంచుతుందని జాతీయ యోగాసన క్వాలీఫైడ్ కోచ్ తోట సతీష్ అన్నారు. ఈనెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని మంగళవారం కొండపాకలోని బాలికల, బాలుర హైస్కూళ్లలో యోగా సొసైటీ ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. తోట సతీష్ మాట్లాడుతూ యోగా ఆరోగ్యవంతమైన జీవితాన్నిస్తుందన్నారు. విద్యార్థుల శారీరక, మానసిక వికాసాలకు యోగా ఎంతో ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థుల్లో ఏకాగ్రత పెంచుతూ మరింతగా విద్యాభ్యాసాలను పొందే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో హెచ్ఎం విఠల్నాయక్, ఉపాధ్యాయులు రఘువర్దన్రెడ్డి, హారతి, రామస్వామి, మహేందర్రెడ్డి, కనకయ్య, రాకేష్, రవీందర్రెడ్డి, సంయొద్దిన్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
జాతీయ యోగాసన క్వాలీఫైడ్ కోచ్ తోట సతీష్