
బడి.. భయపెడుతోంది
ఊడిపడుతున్న పెచ్చులు.. కూలుతున్న చెట్లు
బడి భయపెడుతోంది. పైకప్పు ఊచలు తేలి పెచ్చులు ఊడిపడుతున్నాయి. గోడలు బీటలు వారాయి. వానొస్తే ఉరిసి తడిసిముద్దవుతోంది. శిథిల భవన సముదాయం ఎప్పుడు కూలుతుందోనన్న భయం నెలకొంది. ఆవరణలో భారీ వృక్షాలు సైతం నేలకూలుతూ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. వారం క్రితం స్కూల్ వదలిన తరువాత ఈదురుగాలులకు భారీ వృక్షం నేలకూలింది. పిల్లలు లేని సమయం కావడంతో ముప్పుతప్పింది. ఇలాంటి ప్రమాదకర పరిస్థితి వర్గల్ మండలం జబ్బాపూర్ ప్రాథమిక పాఠశాలలో నెలకొనగా.. తక్షణ చర్యలు చేపట్టాల్సిన అధికారగణం ఏమీపట్టనట్లు చోద్యం చూస్తుండటం గమనార్హం.
శిథిలావస్థలో..
పాత బురుజు పక్కన జబ్బాపూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కొనసాగుతోంది. ఐదు తరగతులు, నాలుగు గదులు, 71 మంది విద్యార్థులతో కూడిన ఈ పాఠశాలలో నలుగురు ఉపాధ్యాయులున్నారు. ఇందులోనే అంగన్వాడీ కేంద్రం కొనసాగుతోంది. దశాబ్దాల క్రితం ఈ భవన సముదాయం నిర్మితమైంది. భవనాలకు పగుళ్లు, పైకప్పునకు తేలిన ఊచలు దర్శనమిస్తాయి.
–వర్గల్(గజ్వేల్)
మందుబాబులు ధ్వంసం చేసిన టాయ్లెట్ టైల్స్
మందు బాబులకు అడ్డాగా సర్కారు బడులు
కొండాపూర్లోని ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలు ధ్వంసమవుతున్నాయి. సరస్వతీ నిలయాలు మందుబాబులకు అడ్డాగా మారాయి. రాత్రి అయ్యిందంటే చాలు ఆవరణాలుసిట్టింగులుగా మార్చేస్తున్నారు. అంతటితో ఆగక తాగిన మద్యం బాటిళ్లను పగులగొడుతున్నారు. దీంతో ఉదయం బడికి వచ్చిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు తిప్పలు తప్పడంలేదు. మరోవైపు టాయిలెట్స్ను సైతం ధ్వంసం చేయడంతో అవసరాలను తీర్చుకోవడానికి విద్యార్థులు ఇంటి దారి పట్టాల్సి వస్తోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మందు బాబుల ఆగడాలు శృతి మించుతున్నాయని గ్రామస్తులు అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి మందుబాబుల ఆగడాలకు కళ్లెం వేయాలని వారు కోరుతున్నారు.
– మిరుదొడ్డి(దుబ్బాక)

బడి.. భయపెడుతోంది

బడి.. భయపెడుతోంది

బడి.. భయపెడుతోంది

బడి.. భయపెడుతోంది