పది విద్యార్థులకు వీడ్కోలు | - | Sakshi
Sakshi News home page

పది విద్యార్థులకు వీడ్కోలు

Mar 9 2026 9:28 AM | Updated on Mar 9 2026 9:28 AM

పది విద్యార్థులకు వీడ్కోలు జహీరాబాద్‌ టౌన్‌: పట్టణంలోని సిద్దార్థ హైస్కూల్‌లో ఆదివారం పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 9వ తరగతి విద్యార్థులు టెన్త్‌ స్టూడెంట్స్‌కు విడ్కోలు పలుకుతూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. స్కూల్‌ ప్రిన్సిపాల్‌ శేఖర్‌రెడ్డి మాట్లాడు తూ పరీక్షలపై భయాన్ని వీడాలన్నారు. ఎలాంటి ఒత్తిడిలేకుండా ప్రశాంతంగా టెన్త్‌ పరీక్షలు రాయాలన్నారు. క్రమశిక్షణ ముఖ్యమని, విజయానికి ఇదే తొలిమెట్టన్నారు. పాఠశాల డైరెక్టర్లు మోహన్‌రెడ్డి, అమర్‌నాథ్‌, మధుసూదన్‌, ఆంజనేయులు తదితరులు మాట్లాడుతూ విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. వట్‌పల్లి(అందోల్‌): మండల పరిధి బిజిలీపూర్‌ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు యువజన కాంగ్రెస్‌ మండల నాయకుడు అరవింద్‌ ఉచి తంగా టీషర్టులను అందజేశారు. ఇటీవల క్రీడ లు ఆడే విద్యార్థులకు ఉచితంగా టీషర్టులను అందజేస్తాననే హామీ మేరకు ఆదివారం 33 మంది విద్యార్థులకు పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాల న్నారు. క్రీడలు శారీరక దృఢత్వంమే కాకుండా, క్రమశిక్షణ, సహనాన్ని పెంపొందిస్తాయన్నా రు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సంగప్ప, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

ముగిసిన శిక్షణ

మునిపల్లి(అందోల్‌): విధులు, బాధ్యతలు, హక్కులపై వార్డు సభ్యులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమం ముగిసింది. ఆదివారం మండల కేంద్రమైన మునిపల్లి రైతు వేదికలో ఈ నెల 4 నుంచి ఆయా గ్రామాల వార్డు సభ్యులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎంపీడీఓ అంజయ్య, ఆయా గ్రామాల వార్డు సభ్యులు పాల్గొన్నారు.

సకాలంలో పన్నులు చెల్లించాలి

సంగారెడ్డి: పట్టణంలోని కాలనీలు వాణిజ్యసముదాయాలను మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ.. సకాలంలో పనులు చెల్లించి పట్టణాభివృద్ధికి పాటుపడాలని కోరారు. అలాగే, రోడ్లపై ట్రాఫిక్‌ అంతరాయం కలిగే వాణిజ్యసముదాయలను తొలగించాలని మున్సిపల్‌ సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట శానిటేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ సజీద్‌ అలీ, బిల్‌ కలెక్టర్లు ఉన్నారు.

విద్యార్థులకు టీషర్టుల పంపిణీ

వీరభద్రుడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

జిన్నారం (పటాన్‌చెరు): గుమ్మడిదల పట్టణ పరిధిలోని వీరన్నగూడెం శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని అందమైన పూలతో అలంకరించారు. మొదటిరోజు జరిగిన పూజ ల్లో ఆలయ కమిటీ చైర్మన్‌ ప్రతాప్‌ రెడ్డి ఆధ్వర్యంలో పాలకమండలి సభ్యులు వీరభద్ర స్వా మికి అభిషేకాలు, భద్రకాళి అమ్మవారికి కుంకుమార్చన పూజలు భక్తులతో కలిసి నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో శశిధర్‌ గుప్తా, భక్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement