ఇది సర్కారు వారి భూమి | - | Sakshi
Sakshi News home page

ఇది సర్కారు వారి భూమి

Apr 26 2025 8:02 AM | Updated on Apr 26 2025 8:02 AM

ఇది సర్కారు వారి భూమి

ఇది సర్కారు వారి భూమి

● కొనుగోలుదారులకు నోటీసులు అందజేసిన రెవెన్యూ అధికారులు ● సీలింగ్‌ భూముల్లో బోర్డుల ఏర్పాటు

ధారూరు: పేదలకు పంచిన సీలింగ్‌ భూములను ఎవరు కొనుగోలు చేసినా ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందని తహసీల్దార్‌ సాజిదాబేగం అన్నారు. సీలింగ్‌, అసైన్డ్‌ భూములను ఎవరు కొనుగోలు చేసినా చెల్లదని, ఎవరైనా తమకు ఫిర్యాదు చేస్తే సదు భూములను వెనక్కి తీసుకుంటామని స్పష్టంచేశాఉ. మండల కేంద్రంలోని 197/4, 197/5 సర్వేనంబర్లలోని 4.08 ఎకరాల సీలింగ్‌ భూమిని తహసీల్దార్‌ ఆదేశం మేరకు శుక్రవారం ఆర్‌ఐ స్వప్న, అసిస్టెంట్‌ ఆర్‌ఐ అంజలి, సర్వేయర్‌ శ్రీహరి, రెవెన్యూ సిబ్బంది కలిసి సదరు భూములను పరిశీలించారు. ఇందులో ప్రభుత్వ భూమి అంటూ బోర్డు పాతారు.

ఏం జరిగిందంటే..

ధారూరుకు చెందిన పత్తి అమృతమ్మకు, చాకలి శంకరయ్యకు ప్రభుత్వం సీలింగ్‌ యాక్ట్‌ కింద 2.04 ఎకరాల చొప్పున భూమిని పంపిణీ చేసింది. వీరి నుంచి అవుసుపల్లి లక్ష్మి సెప్టెంబర్‌, 0226లో 2.04 ఎకరాలు, శెట్టి లలితాదేవి నవంబర్‌ 2, 2008లో 2.04 ఎకరాలు కొనుగోలు చేశారు. అయితే తనకు, తమ పిల్లకు తెలియకుండానే తన భర్త శంకరయ్య సీలింగ్‌ భూమిని విక్రయించారని, దీన్ని తిరిగి ఇప్పించాలని ఇటీవల భూమి విక్రేత కుటుంబ సభ్యులు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో రెవెన్యూ అధికారులు పీఓటీ చట్టం 1977 కింద కొనుగోలుదారులకు నోటీసులు జారీ చేశారు. శుక్రవారం సదరు భూమిలో బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ భూముల్లో వరి సాగు చేశారని, పంట కోత అనంతరంఎవరూ ఇందులోకి వెళ్లకూడదని తహసీల్దార్‌ ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement