
స్కానింగ్ సెంటర్ల తనిఖీ
సిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని స్కానింగ్ సెంటర్లను వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సోమవారం తనిఖీ చేశారు. పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో స్కానింగ్ సెంటర్లను ఆకస్మికంగా పరిశీలించారు. స్కానింగ్ చేయించుకున్న వారి వివరాలు, రికార్డులను తనిఖీ చేశారు. సీ–సెక్షన్ కాన్పులు తగ్గించి సాధారణ ప్రసవాలు చేయాలని కోరారు. లింగనిర్ధారణ చేయడం నేరమని ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అంజలి ఆల్ఫ్రెడ్ స్పష్టం చేశారు. డిప్యూటీ డెమో రాజ్కుమార్, ప్రైవేటు ఆస్పత్రుల డాక్టర్లు లీలాశిరీష, వాణి, హెచ్.ఈ. బాలయ్య తదితరులు పాల్గొన్నారు.