
పోలీస్ బందోబస్తు మధ్య ‘విస్తరణ’
వేములవాడ: ఆధ్యాత్మిక క్షేత్రం కొలువుదీరిన వే ములవాడలో రోడ్ల విస్తరణ పనులు పోలీస్ బందోబస్తు మధ్య కొనసాగుతున్నాయి. 144 సెక్షన్ విధించి 10 మంది తహసీల్దార్లు 10 బృందాలుగా ఏర్పడి 12 జేసీబీలు, 15 ట్రాక్టర్లు, 150 మంది కా ర్మికుల సహాయంతో 150 దుకాణాలను కూల్చి వేశారు. మూలవాగు బ్రిడ్జి నుంచి ఆలయం వరకు ఉన్న మెయిన్రోడ్డును రూ.47కోట్లతో 80 ఫీట్ల వరకు విస్తరించాలని సంకల్పించారు. ఇందుకు 750 మీటర్ల మేర స్థలం అవసరం ఏర్పడింది. 254 మంది లబ్ధిదారులు ఉండగా, ఇందులో 322 నిర్మాణాలు కూల్చివేయాల్సి ఉంది. కొంతమంది కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకోగా, మిగతా వారికి జిల్లా అధికారులు నోటీసులు అందజేశా రు. మొదటిదఫాగా 150 ఇళ్లను కూల్చాలని టార్గెట్ పెట్టుకోగా.. సోమవారం 90 పూర్తికాగా, 60 ఇళ్లను పాక్షికంగా కూల్చివేశారు. ఇప్పటికే 50 మందికిపైగా నష్టపరిహారం చెల్లించామని, స్టే ఉన్న వాటిపై వెకేట్ చేసేందుకు కోర్టులో పిటిషన్ దాఖలు చేశామని భూసేకరణ అధికారి, వేములవాడ ఆర్డీవో రాధాభాయి తెలిపారు. వ్యాపారులు, ప్రజలు సహకరించాలని కోరారు.
బ్రిడ్జి నుంచి గుడి వరకు విస్తరణ
మూలవాగు బ్రిడ్జి నుంచి రాజన్న గుడి వరకు మెయిన్రోడ్డును 80 ఫీట్లతో విస్తరించనున్నారు. మున్సిపల్, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు సమన్వయంతో ముందుకుసాగారు.
వంద మందికి పరిహారం పంపిణీ
సిరిసిల్ల: వేములవాడ పట్టణంలో రోడ్డు విస్తరణలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు సోమవారం కలెక్టరేట్లో చెక్కులు పంపిణీ చేశారు. భూములు కోల్పోతున్న నిర్వాసితులకు కలెక్టర్ సందీప్కుమార్ ఝా, వేములవాడ ఆర్డీవో రాధాభాయి చెక్కులను జారీ చేశారు. ఇప్పటి వరకు వంద మందికి చెక్కులు అందించినట్లు ఆర్డీవో రాధాభాయి వెల్లడించారు. వేములవాడలోని ఇంకా చాలా మంది నష్టపరిహారం చెక్కులు తీసుకునేందుకు ముందుకొస్తున్నట్లు తెలిపారు.
రోడ్డు విస్తరణ పనులు పరిశీలించిన కలెక్టర్
రోడ్డు విస్తరణ పనులను కలెక్టర్ సందీప్కుమార్ ఝా పరిశీలించారు. సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, రెవెన్యూ, మున్సిపల్, ఆర్అండ్బీ శాఖల అధికారులు పాల్గొన్నారు.
10 మంది తహసీల్దార్లు.. 10 బృందాలు
కరెంట్ నిలిపివేసి.. 144 సెక్షన్ విధించి
200 మంది పోలీసులతో బందోబస్తు
పనులు పర్యవేక్షించిన కలెక్టర్ సందీప్కుమార్ ఝా
150కి పైగా దుకాణాల కూల్చివేత
నేడూ కొనసాగనున్న పనులు

పోలీస్ బందోబస్తు మధ్య ‘విస్తరణ’

పోలీస్ బందోబస్తు మధ్య ‘విస్తరణ’